ప్రస్తుతం టాలీవుడ్లో డైరీ అస్సలు ఖాళీ లేని హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. తన కొత్త చిత్రం ‘దేవర’ చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఇది కాక రెండు పాన్ ఇండియా సినిమాలను అతను లైన్లో పెట్టాడు. ఇలాంటి టైంలో తారక్ కొత్త చిత్రం గురించి నిన్న సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రచారం నడిచింది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన శౌర్యువ్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడని.. ‘హాయ్ నాన్న’ను నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్సే భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందని వార్తలు ఊపందుకున్నాయి.
ఐతే హాయ్ నాన్న లాంటి సాఫ్ట్ మూవీ తీసిన శౌర్యువ్.. మాస్ హీరో అయిన తారక్తో ఎలాంటి సినిమా తీస్తాడా అన్న ఊహాగానాల్లోకి అభిమానులు వెళ్లిపోయారు. ఈ కలయిక విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లూ లేకపోలేదు.
ఐతే తారక్-శౌర్యువ్-వైరా సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నది కేవలం ఊహాగానాలే అని తారక్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి కాంక్రీట్గా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. అడ్వాన్సులివ్వడం, కమిట్మెంట్ తీసుకోవడం లాంటివేమీ జరగలేదట. జస్ట్ తారక్ ముందుకు ఒక ప్రపోజల్ మాత్రమే వెళ్లిందని, చూద్దాం అని మాత్రమే తారక్ అన్నారని.. ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని.. కానీ ఈలోపే సినిమా ఓకే అయిపోయినట్లు ప్రచారం జరిగిపోయిందని అంటున్నారు.
తారక్ ప్రస్తుతం ‘దేవర’తో పాటు ‘వార్-2’ సినిమాలో సమాంతరంగా నటిస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ ఉండనే ఉంది. ఇవి కాక మరో పాన్ ఇండియా సినిమా కూడా ప్లానింగ్లో ఉందంటున్నారు. ఈ చిత్రాలన్నీ అయితే కానీ.. వైరా వాళ్లతో సినిమా గురించి స్పష్టత రాదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు ఊహాగానాలే అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…