Movie News

ఆందోళన కలిగిస్తున్న అజిత్ తెలుగు మార్కెట్

తలా అని అభిమానులు పిలుచుకునే అజిత్ కు తెలుగులోనూ ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉండేది. వాలి, ప్రేమలేఖ లాంటివి కమర్షియల్ గా టాలీవుడ్ లో మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. కానీ ఆ తర్వాత అజిత్ నిర్మాతలు ఇక్కడ ఫోకస్ పెట్టకపోవడంతో ఆయన డబ్బింగ్ సినిమాలు క్రమంగా తగ్గిపోవడం మొదలైంది. విశ్వాసం, వివేకం లాంటివి తమిళంలో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా ఇక్కడ మాత్రం యావరేజ్ అయ్యాయి. వలిమై, తెగింపు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి. విజయ్ లాగా అజిత్ సరైన సమయంలో మన ఆడియన్స్ పల్స్ పట్టుకోలేదు.

ఇప్పుడిది అజిత్ కొత్త సినిమా విదాముయార్చి మీద ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ న్యూస్. దసరా లేదా దీపావళికి విడుదల చేసే ఉద్దేశంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తోంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో అజిత్ కారు స్టంట్స్ చేస్తూ నిజంగానే ప్రమాదానికి గురి కావడం కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చికి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదట. అందుకే బిజినెస్ క్లోజ్ చేయలేకపోతున్నారని అంతర్గత సమాచారం.

ఇదే లైకా నిర్మిస్తున్న భారతీయుడు 2 ఫలితం చూశాక అప్పుడు విదాముయార్చి ధరను నిర్ణయించాలని ఇక్కడి పంపిణీదారులు భావిస్తున్నారు. లాల్ సలామ్ కు సంబంధించిన సెటిల్మెంట్స్ కూడా ఇంకా పూర్తవ్వలేదట. ఇదిలా ఉంచితే అక్టోబర్ 10న సూర్య కంగువాతో తలపడాలని అజిత్ నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు వచ్చిన వార్త కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే అజిత్ ఇమేజ్ ఎంత ఉన్నా కంగువతో పోటీ పడేంత ప్యాన్ ఇండియా కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ విదాముయార్చిలో లేవు. అలాంటప్పుడు రిస్క్ చేస్తే ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు.

This post was last modified on July 8, 2024 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago