Political News

ఇదేదో అప్పుడే చేసి ఉంటే.. బాగుండేది జ‌గ‌న్ స‌ర్‌!

“పార్టీ ఓడిపోయిన‌ప్పుడు ప్ర‌జ‌లు గుర్తుకు వ‌చ్చారు. రూల్స్ గుర్తుకు వ‌చ్చాయి. న్యాయం, చ‌ట్టం అంటూ ఉన్నాయ‌న్న విషయం కూడా గుర్తుకు వ‌చ్చింది. అదేదో అధికారంలో ఉన్న‌ప్పుడే గుర్తు పెట్టుకుని ఉంటే.. బాగుండేది”- ఇదీ.. ఇతమిత్థంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి జ‌నాల నుంచి వినిపిస్తున్న మాట‌. ఐదేళ్ల అధికారం అయిపోయిన త‌ర్వాత‌.. అనూహ్య ఓట‌మిని చ‌వి చూసిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు పై వ‌న్నీ గుర్తుకు వ‌స్తున్నాయ‌ని కొంద‌రు ఎద్దేవా చేస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తున్నారు. వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న క‌డ‌ప‌లోనే ఉండ‌నున్నారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా గ‌త రెండు రోజులుగా స్థానిక ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ క‌లుస్తున్నారు. వారి నుంచి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వాస్త‌వానికి మాజీ సీఎంగా జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని భావించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ప‌ద‌వులు కూడా ఇచ్చారు. సో.. ఆయ‌న‌కు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అస‌లు స‌మ‌స్య‌లు ఏముంటాయిలే అని కూడా అనుకుని ఉంటారు. కానీ, ప్ర‌జ‌లు ఇప్పుడు తండోప‌తండాలుగా ఆయ‌న చుట్టూ చేరుతున్నారు. త‌మ‌కు ప‌థ‌కాలు అంద‌లేద‌ని.. తాము అర్హుల‌మైనా.. తీసేశామ‌ని వంద‌ల సంఖ్య‌ల ప్ర‌జ‌లు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో స్థానిక నేత‌ల దూకుడుపైనా కొంద‌రు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్ ఒకింత ఉలిక్కి ప‌డే ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇలా.. జ‌రిగిందా! అని ఆయ‌న ఆశ్చ‌ర్యం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. ఇక‌, వేరే వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. సో.. ఇప్పుడు ప్ర‌జ‌ల ఆవేదన విన్న త‌ర్వాత‌.. వారి ఆక్రోశం గ‌మ‌నించిన త‌ర్వాత‌.. ఎక్క‌డ త‌ప్పు జ‌రిగింందో.. ఎలా ఓట‌మి చెందామో.. ఆయ‌న‌కు అర్ధ‌మై ఉంటుంది.

కానీ, ఇప్ప‌టికే స‌మ‌యం గ‌డిచి పోయింది. ఇప్పుడు అర్జీలు తీసుకుని.. విన్న‌పాల‌కు సంబంధించిన ప‌త్రాలు తీసుకుని ఏం చేయగ‌ల‌రు. స‌భ‌లో పోరాటం చేద్దామంటే వెళ్తారో లేదో కూడా తెలియ‌దు. పోనీ.. ఆయా స‌మ‌స్య‌లు.. ప్ర‌తిప‌క్షం హ‌యాంలో జ‌రిగాయా? అంటే అది కూడా కాదు. త‌న ఏలుబ‌డిలోనే జ‌రిగిన అన్యాయాలు. దీంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏం చేయాలో కూడా తెలియ‌ని స్థితి నెల‌కొంది. ఆ నాడే ప్ర‌జా ద‌ర్బార్‌లు నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టి ఉంటే.. బాగుండేద‌ని, అధికారం కోల్పోయాక‌.. ప‌ద‌వి చేజారాక‌.. ప‌రిస్థితి ఇలా ఉందా? అని వ‌గ‌చి ఏం ప్ర‌యోజ‌నం అంటున్నారు.

This post was last modified on July 8, 2024 7:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

3 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

5 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

12 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

13 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

13 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

15 hours ago