భారతీయుడు 2 కన్నా 3 కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నానని కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటల మీద అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. అంటే రెండో భాగం కన్నా మూడో భాగంలోనే అసలు సినిమా ఉంటుందనే హింట్ ఇస్తున్నారా అంటూ మూవీ లవర్స్ విశ్లేషణ చేసుకున్నారు. పైగా కాజల్ అగర్వాల్ థర్డ్ పార్ట్ లోనే ఉండటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఎట్టకేలకు ఇది సిద్దార్థ్ ద్వారా కమల్ హాసన్ కు చేరింది. ఒక ఈవెంట్ లో స్టేజి మీదే దీనికి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. తానెందుకు ఇండియన్ 3ని హైలైట్ చేయాల్సి వచ్చిందో వివరించారు కమల్.
అమ్మా నాన్నలో ఎవరు ఇష్టమని ఈ ప్రశ్న అడిగినట్టు ఉందని, భారతీయుడు 2 జూలై 12 వస్తోంది కాబట్టి ఆటోమేటిక్ గా తన ఎగ్జైట్ మెంట్ 3 మీదకు వెళ్లిందని చెప్పడమే తన ఉద్దేశం తప్ప మరొకటి కాదని క్లారిటీ ఇచ్చారు. ఇడ్లీ సాంబార్ రసం తిన్న తనకు ఇప్పుడు పాయసం వైపు మనసు లాగుతోందని, భవిష్యత్తులో లైకా దగ్గర సొమ్ములు ఉంటే ఇండియన్ 4 కు కూడా సిద్దమేనని ప్రకటించడం అభిమానులతో చప్పట్లు కొట్టించుకుంది. మరో సందర్భంలో కమల్ హాసన్ మాట్లాడుతూ సెన్సార్ అధికారులు సైతం ప్రత్యేకంగా ఇండియన్ 2ని మెచ్చుకున్నారని చెప్పడం గమనార్హం.
వీటి సంగతెలా ఉన్నా కమల్ హాసన్ కు భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ చాలా అవసరం. విక్రమ్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో వరసగా సినిమాలు చేస్తున్న లోకనాయకుడు తనకు ఏ రూపంలో స్పీడ్ బ్రేకులు పడేందుకు ఇష్టపడటం లేదు. ఆ మాట కొస్తే విక్రమ్ కన్నా ముందు మొదలైన ఇండియన్ 2 క్రేన్ ప్రమాదం వల్ల ఆగిపోయి తిరిగి గేమ్ ఛేంజర్ తో పాటు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంది. ఆరు నెలల తర్వాత మూడో భాగం రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలున్నాయి. తెలుగు వెర్షన్ ని సైతం గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. రేపు హైదరాబాద్ ఈవెంట్ తో టాలీవుడ్ ప్రమోషన్లు మొదలవుతాయి
This post was last modified on July 6, 2024 5:00 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…