కల్కి 2898 ఏడిలో శ్రీకృష్ణుడి మొహం చూపించకుండా కేవలం అర్జున్ దాస్ డబ్బింగ్ తో మేనేజ్ చేసినా సరే ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరిగాయి. అత్యధిక శాతం సూపర్ స్టార్ మహేష్ బాబు అయితేనే మంచి ఛాయస్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఏఐ టెక్నాలజీతో ఫోటోలు కూడా సృష్టించారు. ఏ మాటకా మాటే కానీ కృష్ణుడిగా మహేష్ వాటిలో అదిరిపోయాడు. ఇవాళ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్న ఎదురు కావడంతో అయన స్పందన వచ్చేసింది.
మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా చాలా బాగుంటాడని అయితే అది కల్కిలో కాకుండా వేరే సినిమాలో అయితే తానూ చూడాలని కోరుకుంటున్నానని చెప్పడంతో కల్కి 2లో వేరే ఆర్టిస్టు ఎవరూ ఉండరనే సంకేతం ఇచ్చినట్టు అయ్యింది.
నిజానికి స్వర్గీయ ఎన్టీఆర్ ని తప్ప కృష్ణుడిగా ఇంకెవరిని చూపించడానికి ఇష్టపడని నిర్మాత అశ్వినిదత్ కోరిక మేరకే ఇలా డిజైన్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమనే పాయింట్ మీద ఆయన వైపు నుంచి స్పష్టత రాలేదు. రెండో భాగంలోనూ కృష్ణుడు షాడో రూపంలో కేవలం గొంతు వినిపిస్తాడు తప్పించి రూపం చూసే ఛాన్స్ మాత్రం ఉండదు.
రిలీజైన రెండో వారంలో నాగ్ అశ్విన్ టాలీవుడ్ మీడియాతో ముఖాముఖీ జరపడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. పోనీ సక్సెస్ మీట్ ఏమైనా చేస్తారానే దిశగా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు లేనట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఏడు వందల కోట్లు దాటేసిన కల్కి 2898 ఏడి ఇంకో వారంలోపే వెయ్యి కోట్లను దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తాను ఫాంటసీని, దేవుళ్ళ శక్తులను, మహాభారతాన్ని నమ్ముతానని చెబుతున్న నాగ్ అశ్విన్ రాబోయే భాగాల్లో మరింత శక్తివంతంగా ఆయా ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దబోతున్నాడు. అవే స్థాయిలో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on July 6, 2024 7:05 am
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…