కల్కి 2898 ఏడిలో శ్రీకృష్ణుడి మొహం చూపించకుండా కేవలం అర్జున్ దాస్ డబ్బింగ్ తో మేనేజ్ చేసినా సరే ఆ పాత్రకు ఎవరైతే బాగుంటుందనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరిగాయి. అత్యధిక శాతం సూపర్ స్టార్ మహేష్ బాబు అయితేనే మంచి ఛాయస్ అవుతాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొందరు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఏఐ టెక్నాలజీతో ఫోటోలు కూడా సృష్టించారు. ఏ మాటకా మాటే కానీ కృష్ణుడిగా మహేష్ వాటిలో అదిరిపోయాడు. ఇవాళ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ తో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ ప్రశ్న ఎదురు కావడంతో అయన స్పందన వచ్చేసింది.
మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా చాలా బాగుంటాడని అయితే అది కల్కిలో కాకుండా వేరే సినిమాలో అయితే తానూ చూడాలని కోరుకుంటున్నానని చెప్పడంతో కల్కి 2లో వేరే ఆర్టిస్టు ఎవరూ ఉండరనే సంకేతం ఇచ్చినట్టు అయ్యింది.
నిజానికి స్వర్గీయ ఎన్టీఆర్ ని తప్ప కృష్ణుడిగా ఇంకెవరిని చూపించడానికి ఇష్టపడని నిర్మాత అశ్వినిదత్ కోరిక మేరకే ఇలా డిజైన్ చేశారనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమనే పాయింట్ మీద ఆయన వైపు నుంచి స్పష్టత రాలేదు. రెండో భాగంలోనూ కృష్ణుడు షాడో రూపంలో కేవలం గొంతు వినిపిస్తాడు తప్పించి రూపం చూసే ఛాన్స్ మాత్రం ఉండదు.
రిలీజైన రెండో వారంలో నాగ్ అశ్విన్ టాలీవుడ్ మీడియాతో ముఖాముఖీ జరపడం విశేషం. ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. పోనీ సక్సెస్ మీట్ ఏమైనా చేస్తారానే దిశగా ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు లేనట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఏడు వందల కోట్లు దాటేసిన కల్కి 2898 ఏడి ఇంకో వారంలోపే వెయ్యి కోట్లను దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తాను ఫాంటసీని, దేవుళ్ళ శక్తులను, మహాభారతాన్ని నమ్ముతానని చెబుతున్న నాగ్ అశ్విన్ రాబోయే భాగాల్లో మరింత శక్తివంతంగా ఆయా ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దబోతున్నాడు. అవే స్థాయిలో ఉంటాయో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on July 6, 2024 7:05 am
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…