టాలీవుడ్లో తరచుగా రిస్కీ ప్రాజెక్టులు చేసే హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. కెరీర్ డోలాయమాన స్థితిలో ఉండగా ‘అతనొక్కడే’ లాంటి సాహసోపేత సినిమా చేసి అతను గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. కానీ అతను ఇలా రిస్క్ చేసిన సినిమాల్లో కొన్ని తనను దారుణమైన దెబ్బ కొట్టాయి. హరే రామ్, ఓం త్రీడీ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ రిస్క్లు చేసినా అవి క్యాల్కులేటెడ్గానే ఉంటున్నాయి.
రెండేళ్ల కిందట అతడి నుంచి వచ్చిన ‘బింబిసార’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వశిష్ఠ అనే కొత్త దర్శకుడిని నమ్మి పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీస్తే.. బ్లాక్బస్టర్ అయింది. కళ్యాణ్ రామ్కు అన్ని రకాలుగా ఆ చిత్రం ఆనందాన్నిచ్చింది. ఐతే ఇప్పుడు అతను ‘బింబిసార-2’కు రెడీ అయ్యాడు.
కానీ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దీనికి దర్శకుడు కాదు. అతను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘విశ్వంభర’ మీదికి వెళ్లిపోయాడు. దీంతో సరైన దర్శకుడి కోసం వేట సాగించిన కళ్యాణ్ రామ్.. చివరికి అనిల్ పాడూరిని ఎంచుకున్నాడు. కానీ అతడి ట్రాక్ రికార్డు కొంచెం భయపడుతోంది.
దర్శకుడిగా అనిల్ తొలి చిత్రం ‘రొమాంటిక్’ డిజాస్టర్ అయింది. దాని స్క్రిప్ట్ అంతా పూరీ జగన్నాథ్దే అయినా.. దర్శకుడిగా అనిల్ గొప్ప పనితనమేమీ చూపించలేదు. పైగా దర్శకుడిగా అలాంటి సినిమాతో అరంగేట్రం చేసిన అనిల్.. ‘బింబిసార-2’ లాంటి యాంబిషియస్ ప్రాజెక్టును ఎలా డీల్ చేస్తాడో అన్న సందేహాలున్నాయి. కాకపోతే ‘మగధీర’ సహా కొన్ని పెద్ద సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేయడం అనిల్కు ప్లస్.
‘బింబిసార-2’లో కూడా వీఎఫెక్స్కు ప్రాధాన్యం ఉంటుంది. దీని వరకు అనిల్ ఓకే కానీ.. మొత్తంగా సినిమాను ఎలా డీల్ చేస్తాడన్నది ప్రశ్నార్థకం. ఐతే ఒక టీంను పెట్టి స్క్రిప్టు మీద గట్టిగా కసరత్తు చేయడం, సినిమాకు మంచి టెక్నీషియన్లు పని చేస్తుండడంతో అనిల్ పని తేలికవుతుందని.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నందుకుంటామని కళ్యాణ్ రామ్ ఆశాభావంతో ఉన్నాడు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…