‘కల్కి 2898 ఏడీ’ సినిమాను థియేటర్లలో చూసిన వాళ్లు చాలామందికి కలిగిన సందేహం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో ప్రభాసా, అమితాబ్ బచ్చనా అని. ఎందుకంటే సినిమాలో అమితాబ్ పోషించిన అశ్వథ్థామ పాత్ర మంచి కోసం పోరాడితే.. ప్రభాస్ పాత్ర చెడు వైపు నిలబడుతుంది. ఐతే హీరో పాత్రలు ముందు నెగెటివ్ షేడ్స్తో ఉండి తర్వాత పాజిటివ్గా మారడం మామూలే.
‘కల్కి’లో కూడా ప్రభాస్ పాత్ర ఇలాగే మారేలా కనిపించింది కానీ.. ఫస్ట్ పార్ట్ వరకు అయితే నెగెటివ్ షేడ్స్తోనే కనిపించింది. దీంతో ఈ సినిమాకు అసలైన హీరో అమితాబే అన్న అభిప్రాయం కలిగింది. ఇప్పుడు నిర్మాత అశ్వినీదత్ సైతం ఇదే మాట అనడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అన్నారు. అంతే కాక ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఎవరు అని అడిగినా.. అమితాబ్ అనే చెప్పారు దత్.
అశ్వినీదత్ ఇలా అన్నారని ప్రభాస్ ఫ్యాన్సేమీ ఫీలయిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అమితాబ్ గురించి ప్రభాస్ స్వయంగా అన్న మాటలను కూడా దత్ ఈ ఇంటర్వ్యూలో ఉటంకించారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో అమితాబే అని ప్రభాసే అన్నాడని.. అతడి అభిప్రాయాన్ని తామంతా గౌరవించాలని అనుకున్నామని అశ్వినీదత్ అన్నారు. అమితాబ్ను అలా గౌరవిస్తేనే తమకు గౌరవం దక్కుతుందని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లు కూడా దత్ వెల్లడించారు.
అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడం పట్ల ప్రభాస్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడని.. కల నెరవేరినట్లుగా భావించాడని దత్ తెలిపారు. ఇదిలా ఉండగా ‘కల్కి-2’కు సంబంధించి సగానికి పైనే పూర్తయిందని.. ఆ చిత్రం 2025 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అశ్వినీదత్ చూచాయిగా చెప్పారు.
This post was last modified on July 4, 2024 2:30 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…