కెరీర్లో మొదటిసారి ఒక సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడం నానికి సరిపోదా శనివారం విషయంలోనే జరిగింది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇదే డివివి బ్యానర్ లో దర్శకుడు సుజిత్ తో అఫీషియల్ గా ప్లాన్ చేసుకున్న మూవీని నాని పెండింగ్ లో ఉంచేశాక తర్వాత చేయబోయే చిత్రాల వరసలో మార్పులు వచ్చేశాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీని ఆల్రెడీ ఓకే చేయగా దానికి సంబంధించిన పీ ప్రొడక్షన్, సెట్ పనులు జరుగుతున్నాయి.
ఇంకో నాలుగైదు నెలల తర్వాతే షూటింగ్ ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొనడంతో దాని కన్నా ముందు హిట్ 3 ది థర్డ్ కేస్ తెరకెక్కించేందుకు ప్లానింగ్ అవుతున్నట్టు సమాచారం. దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ ని దాదాపు కొలిక్కి తెచ్చాడట. అడవి శేష్ హీరోగా రూపొందిన హిట్ 2 ది సెకండ్ కేస్ చివర్లో నాని అర్జున్ సర్కార్ ఐపీఎస్, మెంటల్ మాస్ పోలీస్ గా మూడో భాగంలో కనిపిస్తాడని ముంచే హింట్ ఇచ్చారు. అప్పటి నుంచే అభిమానులకు దాని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. సైంధవ్ ఫలితం నిరాశపరచడంతో శైలేష్ తిరిగి తన పాత స్కూలుకు వచ్చేశాడు.
ఇప్పుడు అర్జున్ సర్కార్ ని ధీటుగా సవాల్ చేసే విలన్ కావాలి. ఇప్పుడా వేటనే కొనసాగుతోంది. బాలీవుడ్ యాక్టర్లు కాకుండా ఈసారి సౌత్ నుంచే తీసుకోవాలని శైలేష్ ప్లాన్. దగ్గుబాటి రానాకు స్టోరీ వినిపించారని కాకపోతే ఇంకా ఎలాంటి సంకేతం రాలేదని తెలిసింది. హిట్ 3 విలన్ చాలా క్రూరంగా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా హత్యలు చేసే వాడిగా చూపించబోతున్నారట. అంత ఇంటెన్స్ యాక్టర్ ఉంటే తప్ప దీన్ని పండించడం కష్టం. రానా, ఉపేంద్ర, ఇటీవలే మహారాజలో మెప్పించిన అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారు. మరి శైలేష్ కొలను అన్వేషణ ఎవరి దగ్గర ఆగుతుందో చూడాలి.
This post was last modified on July 4, 2024 11:34 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…