కెరీర్లో మొదటిసారి ఒక సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడం నానికి సరిపోదా శనివారం విషయంలోనే జరిగింది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇదే డివివి బ్యానర్ లో దర్శకుడు సుజిత్ తో అఫీషియల్ గా ప్లాన్ చేసుకున్న మూవీని నాని పెండింగ్ లో ఉంచేశాక తర్వాత చేయబోయే చిత్రాల వరసలో మార్పులు వచ్చేశాయి. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీని ఆల్రెడీ ఓకే చేయగా దానికి సంబంధించిన పీ ప్రొడక్షన్, సెట్ పనులు జరుగుతున్నాయి.
ఇంకో నాలుగైదు నెలల తర్వాతే షూటింగ్ ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొనడంతో దాని కన్నా ముందు హిట్ 3 ది థర్డ్ కేస్ తెరకెక్కించేందుకు ప్లానింగ్ అవుతున్నట్టు సమాచారం. దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ ని దాదాపు కొలిక్కి తెచ్చాడట. అడవి శేష్ హీరోగా రూపొందిన హిట్ 2 ది సెకండ్ కేస్ చివర్లో నాని అర్జున్ సర్కార్ ఐపీఎస్, మెంటల్ మాస్ పోలీస్ గా మూడో భాగంలో కనిపిస్తాడని ముంచే హింట్ ఇచ్చారు. అప్పటి నుంచే అభిమానులకు దాని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. సైంధవ్ ఫలితం నిరాశపరచడంతో శైలేష్ తిరిగి తన పాత స్కూలుకు వచ్చేశాడు.
ఇప్పుడు అర్జున్ సర్కార్ ని ధీటుగా సవాల్ చేసే విలన్ కావాలి. ఇప్పుడా వేటనే కొనసాగుతోంది. బాలీవుడ్ యాక్టర్లు కాకుండా ఈసారి సౌత్ నుంచే తీసుకోవాలని శైలేష్ ప్లాన్. దగ్గుబాటి రానాకు స్టోరీ వినిపించారని కాకపోతే ఇంకా ఎలాంటి సంకేతం రాలేదని తెలిసింది. హిట్ 3 విలన్ చాలా క్రూరంగా ఒళ్ళు గగుర్పొడిచే విధంగా హత్యలు చేసే వాడిగా చూపించబోతున్నారట. అంత ఇంటెన్స్ యాక్టర్ ఉంటే తప్ప దీన్ని పండించడం కష్టం. రానా, ఉపేంద్ర, ఇటీవలే మహారాజలో మెప్పించిన అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు పర్ఫెక్ట్ ఛాయస్ అవుతారు. మరి శైలేష్ కొలను అన్వేషణ ఎవరి దగ్గర ఆగుతుందో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…