కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించిన ఇతర నిర్మాతలు దానికి ముందు వెనుక తమ రిలీజులు లేకుండా జాగ్రత్త పడటంతో ఈ శుక్రవారం జూలై 5 ఎలాంటి కొత్త సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది. 14 టైటిల్ తో ఒక స్ట్రెయిట్ మూవీ రిలీజవుతోంది కానీ దానికి ఓపెనింగ్స్ దక్కడం కూడా డౌటే. అసాధారణమైన టాక్ వస్తే తప్ప నిలబడదు. ఇక బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కిల్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని విడుదలవుతున్నా బజ్ లేదు. నాలుగైదు రోజుల ముందే క్రిటిక్స్ కి స్పెషల్ షోలు వేశారు కానీ వాళ్ళ పాజిటివ్ ట్వీట్లు ఓపెనింగ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించేలా లేవు.
కల్కి చూసేసినవాళ్లకు థియేటర్ పరంగా ఆప్షన్ లేదు కానీ ఒక వెబ్ సిరీస్ మాత్రం విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే మీర్జాపూర్ సీజన్ 3. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వయొలెంట్ డ్రామాకి భారీ అభిమానులున్నారు. మొదటి రెండు భాగాలూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. హింస, బూతులు హద్దులు మీరు ఉన్నాయనే కామెంట్స్ ఎన్ని వచ్చినప్పటికీ మేకర్స్ ఇందులో డోస్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో యూత్ లో ఒకరకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక్కడో సంగతి గుర్తు చేసుకోవాలి. యానిమల్ సమయంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ దాని మీద విమర్శలు చేసినప్పుడు సందీప్ వంగా బదులు చెబుతూ ముందు మీ అబ్బాయి నిర్మాతగా వచ్చిన మీర్జాపూర్ చూడమని కౌంటర్లు వేయడం బాగా హైలైట్ అయ్యింది. అంత వయొలెంట్ కంటెంట్ ఇందులో ఉంది మరి. ఒక ఊరిలో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న కుటుంబంలో జరిగే రాజకీయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. సో కల్కిని పూర్తి చేసి కొత్త ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మీర్జాపూర్ లో అడుగు పెట్టడమే ప్రధాన ఆప్షన్ గా ఉండొచ్చు.
This post was last modified on July 3, 2024 5:59 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…