కల్కి 2898 ఏడి ప్రభంజనాన్ని ముందే ఊహించిన ఇతర నిర్మాతలు దానికి ముందు వెనుక తమ రిలీజులు లేకుండా జాగ్రత్త పడటంతో ఈ శుక్రవారం జూలై 5 ఎలాంటి కొత్త సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది. 14 టైటిల్ తో ఒక స్ట్రెయిట్ మూవీ రిలీజవుతోంది కానీ దానికి ఓపెనింగ్స్ దక్కడం కూడా డౌటే. అసాధారణమైన టాక్ వస్తే తప్ప నిలబడదు. ఇక బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కిల్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని విడుదలవుతున్నా బజ్ లేదు. నాలుగైదు రోజుల ముందే క్రిటిక్స్ కి స్పెషల్ షోలు వేశారు కానీ వాళ్ళ పాజిటివ్ ట్వీట్లు ఓపెనింగ్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించేలా లేవు.
కల్కి చూసేసినవాళ్లకు థియేటర్ పరంగా ఆప్షన్ లేదు కానీ ఒక వెబ్ సిరీస్ మాత్రం విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదే మీర్జాపూర్ సీజన్ 3. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ వయొలెంట్ డ్రామాకి భారీ అభిమానులున్నారు. మొదటి రెండు భాగాలూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. హింస, బూతులు హద్దులు మీరు ఉన్నాయనే కామెంట్స్ ఎన్ని వచ్చినప్పటికీ మేకర్స్ ఇందులో డోస్ ని అంతకంతా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో యూత్ లో ఒకరకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక్కడో సంగతి గుర్తు చేసుకోవాలి. యానిమల్ సమయంలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ దాని మీద విమర్శలు చేసినప్పుడు సందీప్ వంగా బదులు చెబుతూ ముందు మీ అబ్బాయి నిర్మాతగా వచ్చిన మీర్జాపూర్ చూడమని కౌంటర్లు వేయడం బాగా హైలైట్ అయ్యింది. అంత వయొలెంట్ కంటెంట్ ఇందులో ఉంది మరి. ఒక ఊరిలో మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న కుటుంబంలో జరిగే రాజకీయాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. సో కల్కిని పూర్తి చేసి కొత్త ఎంటర్ టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మీర్జాపూర్ లో అడుగు పెట్టడమే ప్రధాన ఆప్షన్ గా ఉండొచ్చు.
This post was last modified on July 3, 2024 5:59 pm
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…