వివిధ భాషల్లో నటిస్తున్న ఓ సినీ కథానాయిక దాదాపు నెల రోజులు జైలు జీవితం గడపాల్సి రావడం అంటే కఠినమైన విషయమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులు ఆరోపణలు ఎదుర్కొని పోలీసుల విచారణ ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కస్టడీలోకి వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి ఇదే పరిస్థితి తలెత్తింది.
ఎన్సీబీ అధికారులు రియాను ఈ నెల 9న రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టు విధించిన రెండు వారాల గడువు మంగళవారం ముగియగా.. ఎన్డీపీఎస్ కోర్టు ఆ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రియా ఇంకో రెండు వారాలు కస్టడీలోనే ఉండనుంది. ఈ రెండు వారాలూ ఎన్సీబీ అధికారులు రియాను విచారించనున్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ కస్టడీని కూడా అక్టోబర్ 6 వరకు కోర్టు పొడిగించింది. రియా లాయర్ ఆమె బెయిల్ కోసం ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరోసారి బెయిల్ పిటిషన్ వేయగా.. బుధవారం ముంబయి కోర్టులో ఆ పిటిషన్ విచారణకు రానుంది. రియా డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన సోదరుడి ద్వారా పలువురు బాలీవుడ్ నటీనటులకు వాటిని సరఫరా చేసేదని ఆరోపణలు ఎదుర్కొంటోంది. విచారణలో భాగంగా రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ సహా పలువురు తారల పేర్లు ఆమె వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి రియాను కీలక ఆధారంగా ఎన్సీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…