వివిధ భాషల్లో నటిస్తున్న ఓ సినీ కథానాయిక దాదాపు నెల రోజులు జైలు జీవితం గడపాల్సి రావడం అంటే కఠినమైన విషయమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసులు ఆరోపణలు ఎదుర్కొని పోలీసుల విచారణ ఎదుర్కొని.. ఆపై డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కస్టడీలోకి వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి ఇదే పరిస్థితి తలెత్తింది.
ఎన్సీబీ అధికారులు రియాను ఈ నెల 9న రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టు విధించిన రెండు వారాల గడువు మంగళవారం ముగియగా.. ఎన్డీపీఎస్ కోర్టు ఆ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రియా ఇంకో రెండు వారాలు కస్టడీలోనే ఉండనుంది. ఈ రెండు వారాలూ ఎన్సీబీ అధికారులు రియాను విచారించనున్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ కస్టడీని కూడా అక్టోబర్ 6 వరకు కోర్టు పొడిగించింది. రియా లాయర్ ఆమె బెయిల్ కోసం ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరోసారి బెయిల్ పిటిషన్ వేయగా.. బుధవారం ముంబయి కోర్టులో ఆ పిటిషన్ విచారణకు రానుంది. రియా డ్రగ్స్ తీసుకోవడంతో పాటు తన సోదరుడి ద్వారా పలువురు బాలీవుడ్ నటీనటులకు వాటిని సరఫరా చేసేదని ఆరోపణలు ఎదుర్కొంటోంది. విచారణలో భాగంగా రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ సహా పలువురు తారల పేర్లు ఆమె వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి రియాను కీలక ఆధారంగా ఎన్సీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 22, 2020 11:27 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…