ఆచార్య షూటింగ్ నవంబర్ నుంచి మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తోండగా, దానికంటే ముందుగా ఒక రెండు, మూడు రోజుల ట్రయల్ షూట్ చేయమని చిరంజీవి సూచించారట. కరోనా బారిన పడకుండా షూటింగ్ చేయడం కుదురుతుందా లేదా అనేది తెలుసుకోవాలని చిరంజీవి ఇలా చెప్పారట. ట్రయల్ షూట్ చేసిన తర్వాత సెట్లో వున్న వాళ్లకు కరోనా టెస్టులు చేయించాలని, వారికి ఏ సమస్యా లేదని తెలిస్తే కొద్ది రోజులు ఆగి రెగ్యులర్ షూటింగ్ చేసుకోవచ్చునని అంటున్నారట.
యువ హీరోలతో పోలిస్తే కరోనా భయం చిరంజీవికి ఎక్కువ వుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అరవయ్యేళ్లు పైబడిన వాళ్లకు ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. అందుకే చిరంజీవితో పాటు వెంకటేష్, బాలకృష్ణ కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు. నాగార్జున మాత్రమే ముందుగా ధైర్యం చేసి బిగ్బాస్తో పాటు వైల్డ్ డాగ్ కూడా మొదలు పెట్టేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకుండానే ‘వకీల్ సాబ్’ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు.
పవన్ అవసరం లేని భాగాలను ముందుగా పూర్తి చేసేసి నవంబర్ నుంచి పవన్పై సీన్స్ తీస్తారు. పవన్కళ్యాణ్కి పెడదామని అనుకున్న ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం.
This post was last modified on September 22, 2020 11:24 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…