Movie News

ట్రయల్‍ షూట్‍ చేయమంటోన్న చిరంజీవి!

ఆచార్య షూటింగ్‍ నవంబర్‍ నుంచి మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తోండగా, దానికంటే ముందుగా ఒక రెండు, మూడు రోజుల ట్రయల్‍ షూట్‍ చేయమని చిరంజీవి సూచించారట. కరోనా బారిన పడకుండా షూటింగ్‍ చేయడం కుదురుతుందా లేదా అనేది తెలుసుకోవాలని చిరంజీవి ఇలా చెప్పారట. ట్రయల్‍ షూట్‍ చేసిన తర్వాత సెట్లో వున్న వాళ్లకు కరోనా టెస్టులు చేయించాలని, వారికి ఏ సమస్యా లేదని తెలిస్తే కొద్ది రోజులు ఆగి రెగ్యులర్‍ షూటింగ్‍ చేసుకోవచ్చునని అంటున్నారట.

యువ హీరోలతో పోలిస్తే కరోనా భయం చిరంజీవికి ఎక్కువ వుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అరవయ్యేళ్లు పైబడిన వాళ్లకు ఈ వైరస్‍ సోకితే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. అందుకే చిరంజీవితో పాటు వెంకటేష్‍, బాలకృష్ణ కూడా షూటింగ్‍ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు. నాగార్జున మాత్రమే ముందుగా ధైర్యం చేసి బిగ్‍బాస్‍తో పాటు వైల్డ్ డాగ్‍ కూడా మొదలు పెట్టేసారు. మరోవైపు పవన్‍ కళ్యాణ్‍ లేకుండానే ‘వకీల్‍ సాబ్‍’ షూటింగ్‍ మళ్లీ మొదలు పెట్టారు.

పవన్‍ అవసరం లేని భాగాలను ముందుగా పూర్తి చేసేసి నవంబర్‍ నుంచి పవన్‍పై సీన్స్ తీస్తారు. పవన్‍కళ్యాణ్‍కి పెడదామని అనుకున్న ఫ్లాష్‍బ్యాక్‍ ఎపిసోడ్‍ షూట్‍ చేయాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం.

This post was last modified on September 22, 2020 11:24 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

1 hour ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

3 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

3 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago