ఆచార్య షూటింగ్ నవంబర్ నుంచి మొదలు పెట్టాలని కొరటాల శివ భావిస్తోండగా, దానికంటే ముందుగా ఒక రెండు, మూడు రోజుల ట్రయల్ షూట్ చేయమని చిరంజీవి సూచించారట. కరోనా బారిన పడకుండా షూటింగ్ చేయడం కుదురుతుందా లేదా అనేది తెలుసుకోవాలని చిరంజీవి ఇలా చెప్పారట. ట్రయల్ షూట్ చేసిన తర్వాత సెట్లో వున్న వాళ్లకు కరోనా టెస్టులు చేయించాలని, వారికి ఏ సమస్యా లేదని తెలిస్తే కొద్ది రోజులు ఆగి రెగ్యులర్ షూటింగ్ చేసుకోవచ్చునని అంటున్నారట.
యువ హీరోలతో పోలిస్తే కరోనా భయం చిరంజీవికి ఎక్కువ వుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అరవయ్యేళ్లు పైబడిన వాళ్లకు ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. అందుకే చిరంజీవితో పాటు వెంకటేష్, బాలకృష్ణ కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు. నాగార్జున మాత్రమే ముందుగా ధైర్యం చేసి బిగ్బాస్తో పాటు వైల్డ్ డాగ్ కూడా మొదలు పెట్టేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకుండానే ‘వకీల్ సాబ్’ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు.
పవన్ అవసరం లేని భాగాలను ముందుగా పూర్తి చేసేసి నవంబర్ నుంచి పవన్పై సీన్స్ తీస్తారు. పవన్కళ్యాణ్కి పెడదామని అనుకున్న ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించుకోలేదని సమాచారం.
This post was last modified on September 22, 2020 11:24 pm
సోషల్ మీడియా ప్రపంచంలో కోట్లాది మంది మునిగి తేలుతూ ఉంటారు. సీరియస్ గా కెరీర్ కోసం వాడుకునే వాళ్ళు కొందరైతే…
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…