Movie News

ఇండియన్-2.. ఆ కథలేవీ నిజం కావట

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైపోయింది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. దీని తర్వాత మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్న భారీ చిత్రం అంటే.. ఇండియన్-2నే. 28 ఏళ్ల కిందట వచ్చిన ‘ఇండియన్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమిది. 90వ దశకంలో ‘ఇండియన్’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అలాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అమితాసక్తి, భారీ అంచనాలు ఉంటాయి.

ఐతే సీక్వెల్ కథ ఏమై ఉంటుంది అనే విషయంలో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. ‘ఇండియన్’లో కమల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తే.. ‘ఇండియన్-2’లో కమల్‌తో పాటు సిద్దార్థ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో వీళ్లిద్దరి పాత్రలు, వారి మధ్య బంధం గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి.

కొందరేమో సిద్ధార్థ్.. కమల్ మనవడని, అతను అవినీతి చేస్తుంటే కమల్ వచ్చి తన పని పడతాడని అన్నారు. ఇంకొందరేమో.. మనవడు తాత బాటలో నిజాయితీపరుడిగా ఉండి హత్యలు చేస్తాడని, అతను కష్టాల్లో పడితే ఇండియన్ తిరిగొస్తాడని అన్నారు. మరోవైపు 1918లో పుట్టిన సేనాపతికి ఇప్పుడు వందేళ్లు దాటి ఉంటుందని.. ఇంకా బతికి ఉండడం ఏంటనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సేనాపతి కొడుకు చనిపోలేదని.. అతడిలో తర్వాత పరివర్తన వచ్చి తనే ఇండియన్ అవతారం ఎత్తుతాడని ఒక చర్చ నడిచింది. ఇలా కథ, పాత్రల పరంగా ఎన్నో వెర్షన్లు వినిపిస్తున్నాయి.

ఐతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని తేల్చేశాడు కమల్ హాసన్. ‘ఇండియన్-2’ కథ గురించి తాను సోషల్ మీడియాలో చాలా వెర్షన్లు చూశానని.. కానీ ఏ ఒక్కరూ ఈ సినిమా కథను సరిగ్గా అంచనా వేయలేకపోయారని.. అది తనకు సంతోషాన్నిచ్చిన విషయమని.. ఈ కథ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

This post was last modified on June 29, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

25 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago