‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఎపిక్ మూవీకి పని చేసిన సాంకేతిక నిపుణుల విషయంలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటి భారీ చిత్రాలకు పెద్ద స్థాయి ఉన్న, పేరుపడ్డ టెక్నీషియన్లనే పెట్టుకుంటారు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం భిన్నమైన దారిలో నడిచాడు. దేశంలో ఎందరో టాప్ సినిమాటోగ్రాఫర్లు ఉండగా.. సెర్బియాకు చెందిన జార్జ్ స్టాజిల్జ్కోవిచ్ అనే ఛాయాగ్రాహకుడిని ఎంపిక చేసుకున్నాడు. ఐతే సినిమా ఔట్ పుట్ చూస్తే అతను గొప్ప పనితనం చూపించాడనే అభిప్రాయమే కలిగింది.
ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే.. ముందు మిక్కీ జే మేయర్ను ఎంపిక చేసుకున్న నాగ్ అశ్విన్.. తర్వాత అతడి స్థానంలోకి సంతోష్ నారాయణన్ను తీసుకొచ్చాడు. తమిళంలో సంతోష్కు మంచి పేరే ఉంది కానీ.. ఈ స్థాయి భారీ చిత్రానికి న్యాయం చేయగలడా అన్న సందేహాలు కలిగాయి.
‘కల్కి’ సినిమా చూసిన ప్రేక్షకులు సంగీత దర్శకుడి పనితనం విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలు పూర్తిగా తేలిపోయాయి. రిలీజ్ ముంగిట అసలు పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం.. జనాల్లోకి తీసుకెళ్లడం లాంటి ప్రయత్నాలే టీం చేయలేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేనట్లే వ్యవహరించారు. భైరవ యాంథెమ్ ఒకటి రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. దానికి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాలో అసలా పాటే లేదు. చిన్న బిట్ మాత్రం వాడారు. అది కాక ఉన్న మూణ్నాలుగు పాటల్లో ఏదీ రిజిస్టర్ కాలేదు. ఇలాంటి భారీ చిత్రాల్లో పాటల గురించి ఎవరు పట్టించుకుంటారని అనుకోవడానికి వీల్లేదు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలకు పాటలు ఎంత ప్లస్ అయ్యాయో చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ ముంగిటే సినిమాకు హైప్ రావడంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. కానీ నాగి మాత్రం పాటల్ని లైట్ తీసుకున్నాడు. సంతోష్ కూడా సరైన పాటలు ఇవ్వలేదు. ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం సంతోష్ మంచి పనితనమే చూపించాడు. మరీ కీరవాణి రేంజ్ ఔట్ పుట్ ఇవ్వలేదు కానీ.. ఈ సినిమాకు న్యాయం చేశాడు. పాటల విషయంలో మైనస్ అయినా.. స్కోర్ వరకు అతను సినిమాకు ప్లస్ అయ్యాడు.
This post was last modified on June 29, 2024 2:29 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…