కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారతీయుడు 2 వచ్చే నెల 12 విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర కావడంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. కల్కి 2898 ఏడి తాకిడి ఎక్కువగా ఉన్నా అప్పటికంతా రెండు వారాలు గడిచిపోయి ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ కి ఎలాంటి లోటు ఉండదనే ధీమా నిర్మాతల్లో కనిపిస్తోంది. కేవలం ఇండియా వైడ్ పబ్లిసిటీకి పరిమితం కాకుండా కమల్, శంకర్, సిద్దార్థ్ లు ఏకంగా విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో కమల్ హాసన్ భారతీయుడు 3కి సంబంధించిన ఒక కీలకమైన ట్విస్టుని బయటికి చెప్పేశారు.
దాని ప్రకారం భారతీయుడు 3లో సేనాపతి తండ్రి వస్తాడు. అంటే మొదటి భాగంలో చనిపోయిన చందూ తాతయ్య. స్వతంత్రం కోసం చేసిన యుద్ధంలో సేనాపతి పాల్గొనే సమయానికి వయసు మళ్ళిన ఒక పోరాట యోధుడు అయన నాన్నగా ఇంకో వైపు బ్రిటిషర్లతో తిరుగుబాటు చేస్తాడన్న మాట. ఇది నిజంగా ఊహించని మలుపు. అసలు ఇప్పటికే భారతీయుడు వయసు వంద సంవత్సరాలు దాటిపోతే ఫైట్లు ఎలా చేస్తాడనే డిబేట్ అభిమానుల మధ్య జరుగుతూ ఉండగా ఇప్పుడు కొత్తగా ఇండియన్ 3లో ఇంకో కమల్ హాసన్ ఉంటాడని చెప్పడం ఊహించని పరిణామం. ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఈ లెక్కన కాజల్ అగర్వాల్ జోడిగా కనిపించేది సేనాపతి తండ్రితోనే. ఈ ఫ్లాష్ బ్యాక్ కీలకం కాబోతోంది. బజ్ విషయంలో వెనుకబడినట్టు అనిపిస్తున్న భారతీయుడు 2కి ట్రైలర్ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. కానీ టీమ్ మాత్రం అందులో ఏం చూపించలేదని, స్క్రీన్ మీద కమల్ చేయబోయే విధ్వంసానికి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూలై నెలలో తెలుగు తమిళంలో ఇదే చెప్పుకోదగ్గ రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇంకో వారంలో బిజినెస్ క్లోజ్ చేసేస్తారు.
This post was last modified on June 29, 2024 2:17 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…