కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారతీయుడు 2 వచ్చే నెల 12 విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర కావడంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. కల్కి 2898 ఏడి తాకిడి ఎక్కువగా ఉన్నా అప్పటికంతా రెండు వారాలు గడిచిపోయి ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ కి ఎలాంటి లోటు ఉండదనే ధీమా నిర్మాతల్లో కనిపిస్తోంది. కేవలం ఇండియా వైడ్ పబ్లిసిటీకి పరిమితం కాకుండా కమల్, శంకర్, సిద్దార్థ్ లు ఏకంగా విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో కమల్ హాసన్ భారతీయుడు 3కి సంబంధించిన ఒక కీలకమైన ట్విస్టుని బయటికి చెప్పేశారు.
దాని ప్రకారం భారతీయుడు 3లో సేనాపతి తండ్రి వస్తాడు. అంటే మొదటి భాగంలో చనిపోయిన చందూ తాతయ్య. స్వతంత్రం కోసం చేసిన యుద్ధంలో సేనాపతి పాల్గొనే సమయానికి వయసు మళ్ళిన ఒక పోరాట యోధుడు అయన నాన్నగా ఇంకో వైపు బ్రిటిషర్లతో తిరుగుబాటు చేస్తాడన్న మాట. ఇది నిజంగా ఊహించని మలుపు. అసలు ఇప్పటికే భారతీయుడు వయసు వంద సంవత్సరాలు దాటిపోతే ఫైట్లు ఎలా చేస్తాడనే డిబేట్ అభిమానుల మధ్య జరుగుతూ ఉండగా ఇప్పుడు కొత్తగా ఇండియన్ 3లో ఇంకో కమల్ హాసన్ ఉంటాడని చెప్పడం ఊహించని పరిణామం. ఇంటరెస్టింగ్ గా ఉంది.
ఈ లెక్కన కాజల్ అగర్వాల్ జోడిగా కనిపించేది సేనాపతి తండ్రితోనే. ఈ ఫ్లాష్ బ్యాక్ కీలకం కాబోతోంది. బజ్ విషయంలో వెనుకబడినట్టు అనిపిస్తున్న భారతీయుడు 2కి ట్రైలర్ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. కానీ టీమ్ మాత్రం అందులో ఏం చూపించలేదని, స్క్రీన్ మీద కమల్ చేయబోయే విధ్వంసానికి థియేటర్లు ఊగిపోవడం ఖాయమని అంటున్నారు. జూలై నెలలో తెలుగు తమిళంలో ఇదే చెప్పుకోదగ్గ రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇంకో వారంలో బిజినెస్ క్లోజ్ చేసేస్తారు.
This post was last modified on June 29, 2024 2:17 pm
ప్రపంచ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా పేరు మార్మోగేలా చేస్తున్న చిత్రం.. కల్కి. గత గురువారం రిలీజైన ఈ చిత్రంలో…
https://www.youtube.com/watch?v=w4yDAjVtHr8 యూత్ హీరో రాజ్ తరుణ్ సోలోగా హిట్టు కొట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. నాగార్జున నా సామిరంగ సక్సెసైనప్పటికీ…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఫేక్ ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్ అనే అభిప్రాయం ఉంది సోషల్ మీడియాలో. 2019లో ఆ…
పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల…
సార్వత్రిక ఎన్నికల సమరంలో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 151 సీట్లతో 2019లో ఎవరూ ఊహించని ఘన…
ప్రభుత్వంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే.. ఎలాంటి కేసు అయినా ఎలా పరిష్కారం అవుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో…