సోషల్ మీడియాలో తెలుగు కుర్రాళ్లు ఫ్యాన్ వార్స్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్ ఎంచుకుంటూ ఉంటారు. కొన్ని టాపిక్స్ చూసి.. వీటి మీద గొడవ పడతారా అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే ఇప్పుడు ఒక టాపిక్ తెలుగు నెటిజన్లను బాగా ఎంగేజ్ చేస్తోంది. నిన్ననే ప్రభాస్-నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ మూవీ అయినా.. అందులోకి మన పురాణ పాత్రలను కూడా తెలివిగా జొప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మహాభారత కాలం నాటి అశ్వథ్థాముడు ఇంకా బతికే ఉన్నట్లు చూపిస్తూ.. ప్రభాస్ చేసిన భైరవ పాత్ర కర్ణుడి అంశలో పుట్టినట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహాభారత కథను అక్కడక్కడా టచ్ చేస్తూ వచ్చిన నాగ్ అశ్విన్.. చివర్లో కర్ణుడి పాత్రకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు.
ఐతే ఇక్కడ అర్జునుడి పాత్రను తగ్గించి కర్ణుడికి ఎలివేషన్ చాలామందికి నచ్చలేదు. హీరో ఏ పాత్ర చేస్తే దాన్ని సినిమాల్లో ఎలివేట్ చేయడం మామూలే. ఈ చిత్రంలో కూడా అదే జరిగింది. ఐతే కర్ణుడు నిజంగా సినిమాలో పేర్కొన్నంత గొప్ప వీరుడు కాదని.. అర్జునుడి ముందు అతను నిలవలేడని సోషల్ మీడియాలో ఒక వర్గం యుద్ధానికి దిగింది. సినిమా అవసరాల కోసం చరిత్రను మార్చడం తప్పని ఆ వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే అర్జునుడి శక్తి సామర్థ్యాలు, అతను చేసిన యుద్ధాలు, తన దగ్గరున్న ఆయుధాల గురించి ఏకరువు పెడుతున్నారు. కర్ణుడు చేసిన తప్పిదాలు, మోసాల గురించి.. అలాగే అతను యుద్ధం నుంచి పారిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఐతే కర్ణుడి గొప్పదనాన్ని కొనియాడుతూ.. అర్జునుడిని తక్కువ చేస్తూ పోస్టులు పెడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇలా నిన్నట్నుంచి నడుస్తున్న ఈ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఐతే ఎప్పుడూ ఎంచుకునే టాపిక్స్తో పోలిస్తే పురాణాల మీద విజ్ఞానాన్ని పెంచేలా నడుస్తున్న ఈ టాపిక్ కొంత నమయమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 29, 2024 10:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…