కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన రేణుక స్వామి మర్డర్ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ వ్యవహారం ఇంకా వేడిగానే ఉంది. ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. సాటి హీరోలు, నటీనటులు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనే తరహాలో స్టేట్ మెంట్లు ఇస్తున్నారు తప్పించి తనకు మద్దతుగా పేరున్న స్టార్లు ఎవరూ నోరు విప్పడం లేదు. అలాంటిది టాలీవుడ్ నుంచి నాగ శౌర్య నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానంటూ ఇన్స్ టా వేదికగా సుదీర్ఘమైన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది వేళ కాదు.
ఎవిడెన్స్ మాయం చేసేందుకు డబ్బులు ఇచ్చానని దర్శనే ఒప్పుకున్నట్టు శాండల్ వుడ్ మీడియా కోడై కూస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో ఇతని కారు తిరిగిన విజువల్స్ సిసి కెమెరా ఫుటేజ్ లో దొరికాయి. పవిత్ర గౌడతో అతనికున్న సంబంధం ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో దర్శన్ చాలా మంచివాడనే తరహాలో నాగ శౌర్య సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం లేనిపోని నెగటివిటీని తెస్తోంది. రేణుకస్వామి హత్య జరిగాక తీసిన ఫోటోలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్లకు ఉరిశిక్ష చాలా తక్కువే అనిపిస్తుంది.
అలాంటిది ఇంత పబ్లిక్ గా మద్దతు తెలుపడం సరికాదని స్వంత ఫ్యాన్సే అంటున్నారు. ఒకవేళ దర్శన్ నిర్దోషిగా బయట పడి కోర్టు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు బెంగళూరు వెళ్లి అభినందించినా తప్పు లేదు. కానీ కళ్ళముందు ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తూ ఉంటే ఐ స్టాండ్ విత్ దర్శన్ అని చెప్పడం లేనిపోని ప్రతికూల పబ్లిసిటీకి దారి తీస్తుంది. అసలే నాగ శౌర్య మార్కెట్ డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లతో తప్పెక్కడ జరిగిందో కనుక్కునే ప్రయత్నంలో నిర్మాణంలో ఉన్న సినిమాను సైతం హోల్డ్ లో పెట్టాడు. అలాంటిది ఇప్పుడీ దర్శన్ ఉదంతంతో అటు కన్నడ సోషల్ మీడియాలోనూ అనవసరంగా టార్గెట్ అవుతున్నాడు
This post was last modified on June 28, 2024 10:58 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…