Movie News

నెగిటివిటీని కొని తెచ్చుకోవడం ఎందుకు

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన రేణుక స్వామి మర్డర్ కేసులో రెండో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ వ్యవహారం ఇంకా వేడిగానే ఉంది. ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు విచారణను తీవ్రతరం చేశారు. సాటి హీరోలు, నటీనటులు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనే తరహాలో స్టేట్ మెంట్లు ఇస్తున్నారు తప్పించి తనకు మద్దతుగా పేరున్న స్టార్లు ఎవరూ నోరు విప్పడం లేదు. అలాంటిది టాలీవుడ్ నుంచి నాగ శౌర్య నేను అతనికి సపోర్ట్ చేస్తున్నానంటూ ఇన్స్ టా వేదికగా సుదీర్ఘమైన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది వేళ కాదు.

ఎవిడెన్స్ మాయం చేసేందుకు డబ్బులు ఇచ్చానని దర్శనే ఒప్పుకున్నట్టు శాండల్ వుడ్ మీడియా కోడై కూస్తోంది. హత్య జరిగిన ప్రదేశంలో ఇతని కారు తిరిగిన విజువల్స్ సిసి కెమెరా ఫుటేజ్ లో దొరికాయి. పవిత్ర గౌడతో అతనికున్న సంబంధం ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో దర్శన్ చాలా మంచివాడనే తరహాలో నాగ శౌర్య సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రయత్నించడం లేనిపోని నెగటివిటీని తెస్తోంది. రేణుకస్వామి హత్య జరిగాక తీసిన ఫోటోలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరించడం ఖాయం. ఈ ఘాతుకానికి పాల్పడిన వాళ్లకు ఉరిశిక్ష చాలా తక్కువే అనిపిస్తుంది.

అలాంటిది ఇంత పబ్లిక్ గా మద్దతు తెలుపడం సరికాదని స్వంత ఫ్యాన్సే అంటున్నారు. ఒకవేళ దర్శన్ నిర్దోషిగా బయట పడి కోర్టు క్లీన్ చిట్ ఇస్తే అప్పుడు బెంగళూరు వెళ్లి అభినందించినా తప్పు లేదు. కానీ కళ్ళముందు ఇన్ని ప్రూఫ్స్ కనిపిస్తూ ఉంటే ఐ స్టాండ్ విత్ దర్శన్ అని చెప్పడం లేనిపోని ప్రతికూల పబ్లిసిటీకి దారి తీస్తుంది. అసలే నాగ శౌర్య మార్కెట్ డౌన్ లో ఉంది. వరస డిజాస్టర్లతో తప్పెక్కడ జరిగిందో కనుక్కునే ప్రయత్నంలో నిర్మాణంలో ఉన్న సినిమాను సైతం హోల్డ్ లో పెట్టాడు. అలాంటిది ఇప్పుడీ దర్శన్ ఉదంతంతో అటు కన్నడ సోషల్ మీడియాలోనూ అనవసరంగా టార్గెట్ అవుతున్నాడు

This post was last modified on June 28, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago