Political News

గౌరవంగా సాగనంపుతున్నారు !

వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల సమయంలో ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్నా వారి స్థానంలో తిరిగి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే పోస్టింగ్ కోసం సిఫారసు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి తప్పించి నూతనప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి జవహర్ రెడ్డి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యది కూడా అదే పరిస్థితి.

త్వరలో ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.

This post was last modified on June 28, 2024 10:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సునాక్‌ పై పాకీ వ్యాఖ్య‌లు.. బ్రిట‌న్‌లో రాజ‌కీయ దుమారం!

బ్రిట‌న్‌లో రాజ‌కీయ దుమారం రేగింది. అధికార, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల మంట‌లు ర‌గులుకున్నాయి. ప్ర‌ధాన మంత్రి రుషి సునాక్‌ను ఉద్దేశించి..…

6 hours ago

మోడీ గారు..కుదిరితే మరో కప్పు కాఫీ…: చంద్రబాబు

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత,…

10 hours ago

దేశంలో న్యాయం మారుతోంది!

దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ మారుతోంది. జూలై 1(సోమ‌వారం) నుంచి దేశ‌వ్యాప్తంగా నూత‌న నేర న్యాయ చట్టాలు అమ‌ల్లోకి రానున్నాయి. అన్ని…

10 hours ago

టీ20లకు మరో భారత క్రికెటర్ గుడ్ బై

టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో సఫారీ…

10 hours ago

నాయుడి జీవితం పై 3 పుస్తకాలు ఆవిష్కరించిన మోదీ

భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. గ్రామ స్థాయి బీజేపీ…

10 hours ago

కల్కి రేట్లు తగ్గించబోతున్నారా?

ఈ వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజైన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే తెచ్చుకుంది.…

10 hours ago