Movie News

‘రెబల్’ అకీరా నందన్

కల్కి 2898 ఏడీ లాంటి భారీ సినిమాలు రిలీజవుతుంటే.. సెలబ్రెటీలు కూడా సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి ఎంతో ఎగ్జైట్మెంట్‌తో థియేటర్లకు వెళ్లిపోతారనడంలో సందేహం లేదు. ఈ రోజు టాలీవుడ్లో యాక్టివిటీస్ చాాలా వరకు ఆగిపోయి సెలబ్రెటీలందరూ కూడా ‘కల్కి’ సినిమాలో మునిగిపోయిన సంకేతాలే కనిపిస్తున్నాయి. ఐతే అలా సినిమా చూసిన వాళ్లలో ఒక వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

అతనే.. అకీరా నందన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా.. గురువారం ‘రెబల్స్’లో ఒకడిగా మారిపోవడం విశేషం. ఈ మధ్య తరచుగా మీడియా దృష్టిలో పడుతున్న అకీరా.. ‘కల్కి’ రిలీజ్ రోజు తెల్లవారుజామునే ఒక మల్టీప్లెక్సుకి వచ్చి ఈ సినిమా చూశాడు. అతడి వెంట తల్లి రేణు దేశాయ్‌ సహా కొందరు సన్నిహితులు ఉన్నారు.

విశేషం ఏంటంటే.. అకీరా ఈ సినిమాకు మామూలుగా రాలేదు. ‘కల్కి’ మెర్చండైజ్ వేసుకునే వచ్చాడు. తన టీషర్ట్ మీద కల్కి పేరు కనిపించింది. చుట్టూ ఉన్న వాళ్లు కూడా ‘కల్కి’ టీషర్టులు వేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు ఇలా ‘కల్కి’ టీషర్ట్ తొడుక్కుని వచ్చేసరికి మీడియాలో బాగా హైలైట్ అయ్యాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అతణ్ని ఓన్ చేసుకుని.. అకీరా కూడా మన రెబల్స్‌లో ఒకడే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

అకీరాకు మ్యూజిక్‌తో పాటు సినిమాల మీద కూడా బాగానే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం హీరో కావడానికి ప్రిపరేషన్లో ఉన్నాడని భావిస్తున్నారు. అందుకే తనను మీడియాకు, సోషల్ మీడియాకు అలవాటు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు, ఫలితాల టైంలో తండ్రితో కనిపించిన అకీరా.. ఇప్పుడు ‘కల్కి’ సినిమా చూసేందుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డాడు.

This post was last modified on June 28, 2024 12:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

11 hours ago