కల్కి 2898 ఏడీ లాంటి భారీ సినిమాలు రిలీజవుతుంటే.. సెలబ్రెటీలు కూడా సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి ఎంతో ఎగ్జైట్మెంట్తో థియేటర్లకు వెళ్లిపోతారనడంలో సందేహం లేదు. ఈ రోజు టాలీవుడ్లో యాక్టివిటీస్ చాాలా వరకు ఆగిపోయి సెలబ్రెటీలందరూ కూడా ‘కల్కి’ సినిమాలో మునిగిపోయిన సంకేతాలే కనిపిస్తున్నాయి. ఐతే అలా సినిమా చూసిన వాళ్లలో ఒక వ్యక్తి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
అతనే.. అకీరా నందన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన అకీరా.. గురువారం ‘రెబల్స్’లో ఒకడిగా మారిపోవడం విశేషం. ఈ మధ్య తరచుగా మీడియా దృష్టిలో పడుతున్న అకీరా.. ‘కల్కి’ రిలీజ్ రోజు తెల్లవారుజామునే ఒక మల్టీప్లెక్సుకి వచ్చి ఈ సినిమా చూశాడు. అతడి వెంట తల్లి రేణు దేశాయ్ సహా కొందరు సన్నిహితులు ఉన్నారు.
విశేషం ఏంటంటే.. అకీరా ఈ సినిమాకు మామూలుగా రాలేదు. ‘కల్కి’ మెర్చండైజ్ వేసుకునే వచ్చాడు. తన టీషర్ట్ మీద కల్కి పేరు కనిపించింది. చుట్టూ ఉన్న వాళ్లు కూడా ‘కల్కి’ టీషర్టులు వేశారు. పవన్ కళ్యాణ్ తనయుడు ఇలా ‘కల్కి’ టీషర్ట్ తొడుక్కుని వచ్చేసరికి మీడియాలో బాగా హైలైట్ అయ్యాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అతణ్ని ఓన్ చేసుకుని.. అకీరా కూడా మన రెబల్స్లో ఒకడే అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
అకీరాకు మ్యూజిక్తో పాటు సినిమాల మీద కూడా బాగానే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం హీరో కావడానికి ప్రిపరేషన్లో ఉన్నాడని భావిస్తున్నారు. అందుకే తనను మీడియాకు, సోషల్ మీడియాకు అలవాటు చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు, ఫలితాల టైంలో తండ్రితో కనిపించిన అకీరా.. ఇప్పుడు ‘కల్కి’ సినిమా చూసేందుకు వచ్చి అందరి దృష్టిలో పడ్డాడు.
This post was last modified on June 28, 2024 12:16 am
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…