ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా సినిమా పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ప్రతి థియేటర్లో డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయిందని, క్లైమాక్స్ అయితే మతిపోయిందని అంటున్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్ లెవల్లో నాగ్ అశ్విన్ నిలబెట్టాడు అన్న టాక్ వినిపిస్తుంది.
అన్నీ చోట్ల నుంచి పాజిటివ్ గా స్పందన వస్తుండడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో అరిపోయి, చిరిగిపోయిన చెప్పును పోస్ట్ చేయడం విశేషం. చాలా కాలంగా ఇవి కొనసాగుతున్నాయి అంటూ నాగ్ అశ్విన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
దాదాపు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నాలుగేళ్లుగా నాగ్ అశ్విన్ ఈ చెప్పులనే వాడుతున్నట్లుగా సమాచారం. అందుకే వాటిని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించడం విశేషం.
This post was last modified on June 27, 2024 5:14 pm
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…