ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్లా సినిమా పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ప్రతి థియేటర్లో డార్లింగ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయిందని, క్లైమాక్స్ అయితే మతిపోయిందని అంటున్నారు. తెలుగు సినిమాను హాలీవుడ్ లెవల్లో నాగ్ అశ్విన్ నిలబెట్టాడు అన్న టాక్ వినిపిస్తుంది.
అన్నీ చోట్ల నుంచి పాజిటివ్ గా స్పందన వస్తుండడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో అరిపోయి, చిరిగిపోయిన చెప్పును పోస్ట్ చేయడం విశేషం. చాలా కాలంగా ఇవి కొనసాగుతున్నాయి అంటూ నాగ్ అశ్విన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
దాదాపు సినిమా ప్రారంభమైనప్పటి నుంచి నాలుగేళ్లుగా నాగ్ అశ్విన్ ఈ చెప్పులనే వాడుతున్నట్లుగా సమాచారం. అందుకే వాటిని పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్.. పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటించడం విశేషం.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…