నిన్న విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఊహించని విధంగా అటు తమిళంలోనూ అసంతృప్తి చెలరేగడం శంకర్ బృందాన్ని షాక్ కి గురి చేసి ఉంటుంది. కథను దాచకుండా కీలకమైన పాయింట్ ని చెప్పేసిన టీమ్ అంచనాలు పెంచే విధంగా ఎడిట్ చేయించలేదనే కామెంట్స్ అభిమానుల్లో వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ చాలా గెటప్పులు వేసినా, వయసు మళ్ళిన దేహంతో నమ్మశక్యం కాని ఫైట్లు చేసినా అవేవి ఆశించిన ఎగ్జైట్ మెంట్ కలిగించలేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఫిర్యాదు. ఇది నాణేనికి ఒక వైపు. పాజిటివ్ గా ఉన్న రెండో వైపు కూడా చూద్దాం.
ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా సేనాపతికి సరైన బ్యాక్ గ్రౌండ్ శంకర్ సెట్ చేశారని, అంచనాలు అందుకోవడం ఖాయమని మరికొందరు అభిప్రాయంపడుతున్నారు. ఏది ఏమైనా శంకర్ స్టామినాకు తగట్టు లేదనేది అధిక శాతం వినిపిస్తున్న అభిప్రాయం. విడుదలకు ఇంకో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో హైప్ పెంచుకోవడం చాలా అవసరం. అందుకే కమల్, శంకర్, సిద్దార్థ్ నిన్న చెన్నైలో ట్రైలర్ లాంచ్ జరగడం ఆలస్యం వెంటనే ముంబై వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ నెలాఖరులో హైదరాబాద్ వేదికగా మరో పెద్ద వేడుక జరుగనుంది.
భారతీయుడు 2 విషయంలో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే శంకర్ నెక్స్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఇదే సంవత్సరం వస్తోంది కాబట్టి. మూడేళ్ళకు పైగా విలువైన సమయాన్ని కేవలం శంకర్ కోసం త్యాగం చేసిన రామ్ చరణ్ దానికి తగ్గ ఫలితం అందుకోవాలని వేరే కమిట్ మెంట్లకు వెళ్లకుండా అడిగినప్పుడల్లా కాల్ షీట్స్ ఇచ్చాడు. బుచ్చిబాబుతో ఆర్సి 16 ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఇదే. భారాతీయుడు 2 బ్లాక్ బస్టర్ అయితే హ్యాపీనే, అది గేమ్ ఛేంజర్ కు ఉపయోగపడుతుంది. శంకర్ మీద నమ్మకం రెట్టింపవుతుంది. లేదంటేనే లేనిపోని సమస్యలు, చిక్కులు.
This post was last modified on June 26, 2024 10:43 am
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…