బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రమంగా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హాలీవుడ్ లో చేయడం కన్నా దక్షిణాది స్టార్స్ తో స్క్రీన్ పంచుకోవడంలోనే ఎక్కువ కిక్ ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సల్లు భాయ్ దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు.
చిరంజీవి గాడ్ ఫాదర్ లో అడగ్గానే చిన్న క్యామియో చేసిన సల్మాన్ అందులో తన పాత్ర నిడివి, ప్రాధాన్యం చూసుకోకుండా కేవలం మెగా ఫ్యామిలీ అడిగిందని ఓకే చెప్పేశాడు. అదేమీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ అంత ఇష్టపడి చేసిన ఆ పాత్ర తెరపై ఆశించిన స్థాయిలో పండలేదు. ఇక విషయానికి వద్దాం.
అల్లు అర్జున్ నో చెప్పాక దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని ముంబై టాక్. ఇందులో కీలకమైన ఒక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
పూర్తి లెన్త్ కాకున్నా పెదరాయుడు టైపులో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే రేంజ్ లో ఆయన ఎపిసోడ్ ఉంటుందట. అయితే రజని దాకా ఇంకా స్టోరీ నెరేషన్ వెళ్ళలేదు. ప్రస్తుతం వెట్టయాన్ పూర్తి చేసిన తలైవా ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ కూలీ సెట్లో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అట్లీ చెప్పిన కథ నచ్చితే ఒకేసారి రజని, సల్మాన్ లను మల్టీస్టారర్ రూపంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మురగదాస్ తో ప్రస్తుతం సికందర్ చేస్తున్న కండల వీరుడు అందులో కోరిమరీ రష్మిక మందన్నను హీరోయిన్ గా ఓకే చేయించాడు.
సౌత్ మార్కెట్ మీద కన్నేయడం వల్ల ఇలా ఆలోచిస్తున్నారో ఏమో కానీ సల్మాన్ మనసులో బాహుబలి, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాల్లో నటించాలని తెగ కోరికగా ఉందట. అలాంటివి కేవలం సౌత్ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు కాబట్టి ఎవరైనా స్టోరీ చెబుతానంటే వద్దనకుండా వింటున్నారని తెలిసింది.
This post was last modified on June 24, 2024 6:01 pm
భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత…
కల్కి 2898 ఏడీ లాంటి భారీ సినిమాలు రిలీజవుతుంటే.. సెలబ్రెటీలు కూడా సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి ఎంతో ఎగ్జైట్మెంట్తో థియేటర్లకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని…
ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే స్వయంగా తన ముందు అతి పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇద్దరు…
ఓపెనింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడిలో పలు అంశాల గురించి మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చలు…