బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రమంగా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హాలీవుడ్ లో చేయడం కన్నా దక్షిణాది స్టార్స్ తో స్క్రీన్ పంచుకోవడంలోనే ఎక్కువ కిక్ ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సల్లు భాయ్ దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు.
చిరంజీవి గాడ్ ఫాదర్ లో అడగ్గానే చిన్న క్యామియో చేసిన సల్మాన్ అందులో తన పాత్ర నిడివి, ప్రాధాన్యం చూసుకోకుండా కేవలం మెగా ఫ్యామిలీ అడిగిందని ఓకే చెప్పేశాడు. అదేమీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ అంత ఇష్టపడి చేసిన ఆ పాత్ర తెరపై ఆశించిన స్థాయిలో పండలేదు. ఇక విషయానికి వద్దాం.
అల్లు అర్జున్ నో చెప్పాక దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని ముంబై టాక్. ఇందులో కీలకమైన ఒక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
పూర్తి లెన్త్ కాకున్నా పెదరాయుడు టైపులో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే రేంజ్ లో ఆయన ఎపిసోడ్ ఉంటుందట. అయితే రజని దాకా ఇంకా స్టోరీ నెరేషన్ వెళ్ళలేదు. ప్రస్తుతం వెట్టయాన్ పూర్తి చేసిన తలైవా ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ కూలీ సెట్లో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అట్లీ చెప్పిన కథ నచ్చితే ఒకేసారి రజని, సల్మాన్ లను మల్టీస్టారర్ రూపంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మురగదాస్ తో ప్రస్తుతం సికందర్ చేస్తున్న కండల వీరుడు అందులో కోరిమరీ రష్మిక మందన్నను హీరోయిన్ గా ఓకే చేయించాడు.
సౌత్ మార్కెట్ మీద కన్నేయడం వల్ల ఇలా ఆలోచిస్తున్నారో ఏమో కానీ సల్మాన్ మనసులో బాహుబలి, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాల్లో నటించాలని తెగ కోరికగా ఉందట. అలాంటివి కేవలం సౌత్ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు కాబట్టి ఎవరైనా స్టోరీ చెబుతానంటే వద్దనకుండా వింటున్నారని తెలిసింది.
This post was last modified on June 24, 2024 6:01 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…