బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్రమంగా సౌత్ సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. హాలీవుడ్ లో చేయడం కన్నా దక్షిణాది స్టార్స్ తో స్క్రీన్ పంచుకోవడంలోనే ఎక్కువ కిక్ ఉంటుందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సల్లు భాయ్ దానికి తగ్గట్టే అడుగులు వేస్తున్నాడు.
చిరంజీవి గాడ్ ఫాదర్ లో అడగ్గానే చిన్న క్యామియో చేసిన సల్మాన్ అందులో తన పాత్ర నిడివి, ప్రాధాన్యం చూసుకోకుండా కేవలం మెగా ఫ్యామిలీ అడిగిందని ఓకే చెప్పేశాడు. అదేమీ బ్లాక్ బస్టర్ కాలేదు కానీ అంత ఇష్టపడి చేసిన ఆ పాత్ర తెరపై ఆశించిన స్థాయిలో పండలేదు. ఇక విషయానికి వద్దాం.
అల్లు అర్జున్ నో చెప్పాక దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని ముంబై టాక్. ఇందులో కీలకమైన ఒక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్.
పూర్తి లెన్త్ కాకున్నా పెదరాయుడు టైపులో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే రేంజ్ లో ఆయన ఎపిసోడ్ ఉంటుందట. అయితే రజని దాకా ఇంకా స్టోరీ నెరేషన్ వెళ్ళలేదు. ప్రస్తుతం వెట్టయాన్ పూర్తి చేసిన తలైవా ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ కూలీ సెట్లో అడుగు పెట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అట్లీ చెప్పిన కథ నచ్చితే ఒకేసారి రజని, సల్మాన్ లను మల్టీస్టారర్ రూపంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మురగదాస్ తో ప్రస్తుతం సికందర్ చేస్తున్న కండల వీరుడు అందులో కోరిమరీ రష్మిక మందన్నను హీరోయిన్ గా ఓకే చేయించాడు.
సౌత్ మార్కెట్ మీద కన్నేయడం వల్ల ఇలా ఆలోచిస్తున్నారో ఏమో కానీ సల్మాన్ మనసులో బాహుబలి, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాల్లో నటించాలని తెగ కోరికగా ఉందట. అలాంటివి కేవలం సౌత్ డైరెక్టర్లు మాత్రమే తీయగలరు కాబట్టి ఎవరైనా స్టోరీ చెబుతానంటే వద్దనకుండా వింటున్నారని తెలిసింది.
This post was last modified on June 24, 2024 6:01 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…