మాములుగా సినిమా పరిశ్రమకు రాజకీయాలకు అంతర్గతంగా ఎంత సంబంధాలు ఉన్నా లేకపోయినా వాటిని బహిర్గత పరుచుకునేందుకు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతగా ఇష్టపడరు.
అందుకే ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు ఎవరికి వారు వెళ్లి విడిగా శుభాకాంక్షలు చెప్పడం తప్పించి అంతకు మించి సెలబ్రేషన్లు చేసిన దాఖలాలు చాలా అరుదు. దాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సమూలంగా మార్చేస్తోంది.
ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి విజయాన్ని పురస్కరించుకుని ఇండస్ట్రీతో పాటు మీడియాకు పెద్ద పార్టీ ఇవ్వడం సంచనలమే.
పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ కి పలురకాలుగా ఈ సక్సెస్ ఆనందాన్ని ఇస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ బ్రో సమయంలో వైసిపి నేతలు ఉద్దేశపూర్వకంగా దాని మీద చెడు ప్రచారం చేయడమే కాక హీరో రెమ్యునరేషన్ గురించి కొందరు మంత్రులు తప్పుడు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఒక మినిస్టర్ ఏకంగా సినిమా ఫ్లాప్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ రివ్యూ ఇచ్చారు. దానికి విశ్వప్రసాద్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. మరో కారణం స్వయానా తన బంధువు టిజి వెంకటేష్ కుమారుడు టిజి భరత్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అందుకోవడం సంతోషాన్ని రెట్టింపు చేసింది.
వ్యక్తిగతంగా ఆస్వాదించడానికి బదులు లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఈవెంట్ చేయడమంటే భేషైన నిర్ణయమే. ప్రచార సమయంలో జగన్ ని గద్దె దింపుతానని పవన్ కళ్యాణ్ చేసిన చేసిన శపథాన్ని స్టేజి మీద డాన్సు రూపంలో ప్రదర్షింపజేయడం చూస్తే విశ్వప్రసాద్ ఎంత బలంగా కూటమి బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
గతంలో సిఎంలకు టాలీవుడ్ తరఫున సన్మానాలు జరిగాయి కానీ ఇంత గ్రాండ్ గా వేడుక జరగడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పాలి. వీటికి తోడు జనసేనకే సినిమాటోగ్రఫీ శాఖ దక్కడం మంచి రోజులు వచ్చాయనే మాటకు సూచకంగా భావిస్తున్నారు.
This post was last modified on June 23, 2024 9:54 pm
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…