Movie News

‘కల్కి’లో రాజమౌళి, ఆర్జీవీ?

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ఇంకో వారం రోజులు కూడా సమయం లేదు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా రిలీజైన కొత్త ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఇంకా పెంచింది.

ఈ ట్రైలర్లో కొన్ని సర్ప్రైజులు కూడా కనిపించాయి. కొన్ని కొత్త పాత్రలను పరిచయం చేశారు. మలయాళ యువ నటి మాళవిక నాయర్ ఇందులో కీలక పాత్రే చేస్తున్న విషయం రిలీజ్ ట్రైలర్లో వెల్లడించారు. ఇంకోవైపు మరో మలయాళ టాలెంటెడ్ హీరోయిన్ అన్నా బెన్ తొలిసారిగా ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. కుంబలంగి నైట్స్, హెలెన్, కప్పెల లాంటి చిత్రాలతో అన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ‘కల్కి’లోని అద్భుత ప్రపంచంలో ఫ్యూచరిస్టిక్ వెహికల్ నడుపుతూ కనిపించింది.

ఐతే సినిమాలో ఇలాంటి సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు మరిన్ని ఉంటాయని.. వైజయంతీ మూవీస్‌తో మంచి అనుబంధం ఉన్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు కూడా ఆశ్చర్యకర పాత్రలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారని అంటున్నారు. అంతే కాక కీర్తి సురేష్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమని.. ఆమె వాయిస్ ఓవర్ ఇస్తుందని అంటున్నారు.

అంతే కాక రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్‌లో కనిపిస్తారన్నది లేటెస్ట్ హాట్ న్యూస్. ‘కల్కి’ కథ ప్రకారం భవిష్యత్తులోకి ప్రయాణం ఉంటుంది. మరి ఆ భవిష్యత్తులో రాజమౌళి, ఆర్జీవీ నిజ జీవిత పాత్రల్లో కనిపించి ఏమైనా సర్ప్రైజ్ చేస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వీళ్లిద్దరూ నిజంగా సినిమాలో ఉంటే థియేటర్లు హోరెత్తిపోతాయనడంలో సందేహం లేదు.

This post was last modified on June 22, 2024 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

43 minutes ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

1 hour ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

2 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

3 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

4 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

4 hours ago