కల్కి సినిమా మదలైనపుడే ఇది ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ముందు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లని అనుకున్నారు. కానీ తర్వాత అది 600 కోట్లకు పెరిగింది. రిలీజ్ టైంకి అందుతున్న సమాచారం ప్రకారం కల్కి బడ్జెట్ ఏకంగా రూ.700 కోట్లట. ఈ సినిమా ప్రోమోలు చూస్తే అంత ఖర్చు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదనే అనిపిస్తుంది. ప్రొడక్షన్లో ఆ స్థాయి క్వాలిటీ కనిపిస్తోంది.
ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే రూ.450 కోట్లట. మిగతా 250 కోట్లు కేవలం పారితోషకాలకే అయిందన్నది యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో మేజర్ వాటా హీరో ప్రభాస్కే వెళ్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సలార్ తరహాలోనే ఈ చిత్రానికి కూడా ప్రభాస్ రూ.150 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ప్రభాస్కు ఉన్న ఇమేజ్, మార్కెట్కు.. అతను ఈ సినిమా కోసం వెచ్చించిన సమయం, పడ్డ కష్టానికి అతను ఈ స్థాయిలో పారితోషకం తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కల్కిలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్, కమల్ హాసన్ తలో రూ.20 కోట్ల చొప్పున పారితోషకం తీసుకున్నారట. మిగతా ఆర్టిస్టులందరికీ కలిపి రూ.60 కోట్ల మేర రెమ్యూనరేషన్ల ఖర్చు తేలింది.
కల్కికి రికార్డు స్థాయిలోనే బిజినెస్ జరిగినట్లు సమాచారం. థియేట్రికల్ హక్కుల రూపంలోనే రూ.600 కోట్లు దాకా వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కులు అందులో సగం కంటే ఎక్కువే తెచ్చి పెట్టి ఉంటాయని అంచనా. మొత్తంగా రూ.1000 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కల్కి ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానున్న ఇండియన్ సినిమా ఇదే కాబోతోంది.
This post was last modified on June 22, 2024 12:27 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…