కల్కి సినిమా మదలైనపుడే ఇది ఇండియాలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా అని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ముందు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లని అనుకున్నారు. కానీ తర్వాత అది 600 కోట్లకు పెరిగింది. రిలీజ్ టైంకి అందుతున్న సమాచారం ప్రకారం కల్కి బడ్జెట్ ఏకంగా రూ.700 కోట్లట. ఈ సినిమా ప్రోమోలు చూస్తే అంత ఖర్చు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదనే అనిపిస్తుంది. ప్రొడక్షన్లో ఆ స్థాయి క్వాలిటీ కనిపిస్తోంది.
ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే రూ.450 కోట్లట. మిగతా 250 కోట్లు కేవలం పారితోషకాలకే అయిందన్నది యూనిట్ వర్గాల సమాచారం. ఇందులో మేజర్ వాటా హీరో ప్రభాస్కే వెళ్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సలార్ తరహాలోనే ఈ చిత్రానికి కూడా ప్రభాస్ రూ.150 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ప్రభాస్కు ఉన్న ఇమేజ్, మార్కెట్కు.. అతను ఈ సినిమా కోసం వెచ్చించిన సమయం, పడ్డ కష్టానికి అతను ఈ స్థాయిలో పారితోషకం తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కల్కిలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్, కమల్ హాసన్ తలో రూ.20 కోట్ల చొప్పున పారితోషకం తీసుకున్నారట. మిగతా ఆర్టిస్టులందరికీ కలిపి రూ.60 కోట్ల మేర రెమ్యూనరేషన్ల ఖర్చు తేలింది.
కల్కికి రికార్డు స్థాయిలోనే బిజినెస్ జరిగినట్లు సమాచారం. థియేట్రికల్ హక్కుల రూపంలోనే రూ.600 కోట్లు దాకా వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కులు అందులో సగం కంటే ఎక్కువే తెచ్చి పెట్టి ఉంటాయని అంచనా. మొత్తంగా రూ.1000 కోట్ల మేర ఈ చిత్రం బిజినెస్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కల్కి ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానున్న ఇండియన్ సినిమా ఇదే కాబోతోంది.
This post was last modified on June 22, 2024 12:27 pm
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…