న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్, దసరాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాక ఈ సంవత్సరం ప్రేక్షకులను పలకరించలేదు. ఆగస్ట్ 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా డివివి దానయ్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇదిలా ఉండగా నాని ముందు ఓకే అనుకున్న రెండు సినిమాలు రద్దు కావడం ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్ లో ఒకటి, బలగం వేణుతో మరొకటి రెండు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి.
కారణాలు ఏమైనా స్క్రిప్టులు పూర్తి సంతృప్తినివ్వలేదనే టాక్ అంతర్గత వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో నాని చాలా సూటిగా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైనం తేటతెల్లం అవుతోంది. ఇప్పుడు నాని రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖరారే. వాటిలో మొదటిది హిట్ 3 థర్డ్ కేస్. శైలేష్ కొలను స్టోరీని ఒక కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. వెంకటేష్ సైంధవ్ నిరాశపరిచినప్పటికీ అతని మీద నమ్మకంతో నాని ఈసారి తన ప్రొడక్షన్ లోనే హిట్ సిరీస్ ఛాన్స్ కొనసాగిస్తున్నాడు. దీనితో పాటు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలకు ఆల్రెడీ ఓకే చెప్పేశాడు కాబట్టి దాని పనులు కూడా జరుగుతున్నాయి.
2025లో ఖచ్చితంగా రెండు రిలీజులు ఉండాలనేది నాని టార్గెట్. ప్రతి సంవత్సరం ఇలాగే ప్లాన్ చేసుకున్నా ఈసారి మిస్ అయ్యింది. వచ్చే ఏడాది అలా జరగకూడదనేది తన సంకల్పం. ఒకవేళ వేణు, సుజిత్ చెప్పిన కథల గురించి టైం ఇచ్చి, ఆలోచన చేయకపోయి ఉంటే ఈపాటికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళేది. రవితేజలాగే నానికి ఎక్కువ గ్యాప్ రావడం ఇష్టం ఉండదు. అది నెలలైనా సరే. కానీ 2024 కేవలం సరిపోదా శనివారంతో సరిపెట్టాల్సి రావడం వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేకపోయినా పరిస్థితులు అలా ప్రేరేపించాయి. శౌర్యువ్ కూడా నాని కోసం ఒక కథను సిద్ధం చేస్తునట్టు వినికిడి.
This post was last modified on June 21, 2024 6:35 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…