కొంత కాలం క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ ఛాంబర్లో టాలీవుడ్ అగ్ర హీరోలు, పెద్దల సమావేశంలో దయచేసి మా సమస్యల్ని అర్థం చేసుకోమంటూ చిరంజీవి దండం పెడుతూ విన్నవించుకున్న వీడియో అభిమానుల మనసులో నుంచి అంత సులభంగా చెరిగేది కాదు. ఇది అవమానంగా ఫీలైన ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు ప్రచార వేదికల్లో దీని గురించి ప్రస్తావించి సీరియస్ కావడం అందరికీ గుర్తే. పైగా ఇది చాలదన్నట్టు టికెట్ రేట్ల పెంపు కోసం బడా ప్రొడ్యూసర్లు సైతం పరుగున వెళ్లి వైసిపి మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ మహాప్రభో అనాల్సి వచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జనసేన తరఫున గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి అలంకరించిన కందుల దుర్గేష్ మినిస్టర్ హోదాలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సెట్ కు వెళ్లి మరీ కలుసుకోవడం, ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరలవుతోంది. పవన్ సూచనల మేరకు దుర్గేష్ వెళ్లి కలిసి ఉండొచ్చు కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి అగ్ర హీరోను కలుసుకుని శుభాకాంక్షలు అందుకోవడం మాత్రం గత కొన్నేళ్లలో చూడని అరుదైన దృశ్యం. స్వతహాగా చిరు ఫాన్ అయిన కందుల దుర్గేష్ కు ఆయన జీవితంలో అతి గొప్ప క్షణాల్లో ఇదో మధుర జ్ఞాపకంగా మిగులుతుంది.
దీన్ని కేవలం మాములు కలయికగా చూసేందుకు లేదు. ఎందుకంటే భవిష్యత్తులో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ కందుల దుర్గేష్ ద్వారానే జరగబోతున్నాయి. తనకు ఎలాంటి భేషజాలు లేవని, అధినేత మనోగతం ప్రకారమే నడుచుకుంటాని ఈ చర్య ద్వారా చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. పవన్ పార్టీ మనిషే కీలక శాఖ నిర్వహిస్తుండటంతో సినిమా వర్గాల్లో రాబోయే రోజుల గురించి గొప్ప ఆశాభావం కనిపిస్తోంది. చిరుతో పాటు విశ్వంభర టీమ్ మొత్తం మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం అయ్యింది. పలు రాజకీయ సినిమా అంశాలు చర్చించుకున్నారట.
This post was last modified on June 20, 2024 11:30 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…