కొంత కాలం క్రితం ఏపీ మాజీ సీఎం జగన్ ఛాంబర్లో టాలీవుడ్ అగ్ర హీరోలు, పెద్దల సమావేశంలో దయచేసి మా సమస్యల్ని అర్థం చేసుకోమంటూ చిరంజీవి దండం పెడుతూ విన్నవించుకున్న వీడియో అభిమానుల మనసులో నుంచి అంత సులభంగా చెరిగేది కాదు. ఇది అవమానంగా ఫీలైన ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు ప్రచార వేదికల్లో దీని గురించి ప్రస్తావించి సీరియస్ కావడం అందరికీ గుర్తే. పైగా ఇది చాలదన్నట్టు టికెట్ రేట్ల పెంపు కోసం బడా ప్రొడ్యూసర్లు సైతం పరుగున వెళ్లి వైసిపి మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ మహాప్రభో అనాల్సి వచ్చింది.
కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. జనసేన తరఫున గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి అలంకరించిన కందుల దుర్గేష్ మినిస్టర్ హోదాలో చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సెట్ కు వెళ్లి మరీ కలుసుకోవడం, ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరలవుతోంది. పవన్ సూచనల మేరకు దుర్గేష్ వెళ్లి కలిసి ఉండొచ్చు కానీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి అగ్ర హీరోను కలుసుకుని శుభాకాంక్షలు అందుకోవడం మాత్రం గత కొన్నేళ్లలో చూడని అరుదైన దృశ్యం. స్వతహాగా చిరు ఫాన్ అయిన కందుల దుర్గేష్ కు ఆయన జీవితంలో అతి గొప్ప క్షణాల్లో ఇదో మధుర జ్ఞాపకంగా మిగులుతుంది.
దీన్ని కేవలం మాములు కలయికగా చూసేందుకు లేదు. ఎందుకంటే భవిష్యత్తులో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ కందుల దుర్గేష్ ద్వారానే జరగబోతున్నాయి. తనకు ఎలాంటి భేషజాలు లేవని, అధినేత మనోగతం ప్రకారమే నడుచుకుంటాని ఈ చర్య ద్వారా చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. పవన్ పార్టీ మనిషే కీలక శాఖ నిర్వహిస్తుండటంతో సినిమా వర్గాల్లో రాబోయే రోజుల గురించి గొప్ప ఆశాభావం కనిపిస్తోంది. చిరుతో పాటు విశ్వంభర టీమ్ మొత్తం మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం అయ్యింది. పలు రాజకీయ సినిమా అంశాలు చర్చించుకున్నారట.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…