ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప-2’ ముందు ప్రకటించినట్లు ఆగస్టు 15న విడుదల కాదన్న ప్రకటన దేశవ్యాప్తంగా సినీ ప్రియులను నిరాశకు గురి చేసింది. ఇప్పటికే ఆ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకో నాలుగు నెలలు అదనంగా నిరీక్షించాల్సి వస్తోంది. ‘పుష్ప-2’ వాయిదా వల్ల చాలా సినిమాల షెడ్యూళ్లు తారుమారు అయ్యాయి. ‘పుష్ప-2’ బడ్జెట్, బిజినెస్ మీద కూడా వాయిదా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది.
అదే సమయంలో వేరే సినిమాలు కొన్నింటికి ‘పుష్ప-2’ వాయిదా నిర్ణయం ప్లస్ అవుతోంది. క్రేజీ డేట్ అయిన ఆగస్ట్ 15ను వాడేసుకోవడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ లాంటి చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. మరోవైపు ‘పుష్ప-2’ వాయిదా నిర్ణయం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ క్రేజ్, బిజినెస్ను పెంచిందన్నది ట్రేడ్ వర్గాల సమాచారం.
ఈ నెల చివర్లో ‘కల్కి’ లాంటి బారీ చిత్రం వచ్చాక భారతీయ ప్రేక్షకుల దృష్టంతా ‘పుష్ప-2’ మీదే ఉండేది. కానీ ఆ సినిమా వాయిదా పడడంతో ప్రేక్షకుల ఫోకస్ ‘దేవర’ మీదికి మళ్లనుంది. మధ్యలో ‘ఇండియన్-2’ లాంటి పెద్ద సినిమా ఉన్నా సరే.. మాస్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది ‘దేవర’నే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగింది. రిలీజ్ టైంకి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి క్రేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విడుదలకు ఇంకా వంద రోజులు ఉండగానే ‘దేవర’ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోవడం విశేషం. ముందు అనుకున్న దాని కంటే ఎక్కువ రేట్లకే ఈ సినిమాను కొన్నారు బయ్యర్లు. తెలుగు రాష్ట్రాల వరకే ‘దేవర’ థియేట్రికల్ హక్కులు రూ.120 కోట్ల మేర అమ్ముడవడం విశేషం. ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్ల మార్కును టచ్ చేస్తోంది.
This post was last modified on June 20, 2024 11:30 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…