అమితాబ్ బచ్చన్.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన హీరోల్లో ఒకరు. ఒకప్పుడు, ఇప్పుడు దేశమంతా ఎంతో గౌరవించే ఆర్టిస్టుల్లో ఒకరైన అమితాబ్.. 80 ఏళ్లు పైబడ్డప్పటికీ చురుగ్గా సినిమాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
అలాంటి లెజెండరీ నటుడు.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వినీదత్కు పాదాభివందనం చేసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దత్ నిర్మించిన మెగా మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ అశ్వథ్థామగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ బుధవారం ముంబయిలో జరిగింది.
ఈ వేడుకలో పాల్గొన్న అమితాబ్.. స్టేజ్ మీదికి అశ్వినీదత్ రాగానే దగ్గరికి వెళ్లి ముందుకు వంగి పాదాభివనందనం చేయబోయారు. దత్ ఆయన్ని వారించడమే కాక ప్రతిగా తాను వంగి అమితాబ్ తరహాలోనే పాదాభివందనం చేశారు. విశేషం ఏంటంటే.. అమితాబ్ కంటే దత్ చిన్నవాడు. బిగ్-బి వయసు 81 ఏళ్లు కాగా.. దత్కు ఇంకా 73 ఏళ్లే. స్థాయి పరంగా చూసుకున్నా కూడా అమితాబ్ ముందు దత్ చిన్నవాడే. కానీ నిర్మాతగా దత్ ప్రయాణం, ‘కల్కి’ లాంటి మెగా మూవీ కోసం ఆయన చూపించిన తపన చూసి అమితాబ్ ఫిదా అయి ఆయన్నిలా గౌరవించి ఉండొచ్చు. వయసు, స్థాయి చూడకుండా అమితాబ్ ఇలా పాదాభివనందనం చేశాడంటే ఆయన హుందాతనానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.
ఇక ఈ వేడుకలో దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి బిగ్-బి గొప్పగా మాట్లాడాడు. ‘కల్కి’ కథ వినగానే ఆశ్చర్యపోయానని, అతను రోజూ ఏం తాగుతాడని ఆశ్చర్యం కలిగిందని అమితాాబ్ వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on June 20, 2024 10:54 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…