పెద్ద సినిమాల విడుదల తేదీ వ్యవహారం క్రమంగా సస్పెన్స్ మూవీని మించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కు వెళ్ళిపోయాక ఒక్కసారిగా ఇతర నిర్మాతల ప్లానింగ్ లో మార్పులు తలెత్తుతున్నాయి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ ఇంకా పూర్తవ్వనప్పటికీ 2024లోనే రిలీజ్ చేయాలనేది నిర్మాత సంకల్పం. ఎందుకంటే ఇదే బ్యానర్ లో రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తీస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ని 2025 సంక్రాంతికి లాక్ చేశారు కనక. ఇక్కడే కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 డిసెంబర్ ఆరున వస్తుంది కాబట్టి రెండు వారాల గ్యాప్ తీసుకుని ఇరవైన బాలయ్య వస్తే ఇబ్బంది ఉండదు. కానీ తండేల్, రాబిన్ హుడ్ ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పుకోవడం ఫిక్సని ఫిలిం నగర్ టాక్. నితిన్ మూవీని నవంబర్ కు జరపాలని చూస్తున్నారు. ఎలాగూ తమ్ముడుని ఫిబ్రవరిలో తీసుకొచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఈ గ్యాప్ సరిపోతుంది. కానీ తండేల్ ని ఏం చేయాలనేది అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే వీలైనంత సోలోగా తండేల్ రావడం అవసరం. నేరుగా బాలయ్య లాంటి ఫుల్ ఫామ్ లో ఉన్న బడా స్టార్ హీరోతో తలపెడితే పెద్ద రిస్క్ అవుతుంది.
మరి చివరికి ఏం జరుగుతుందంటే ఎవరైనా ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దర్శకుడు బాబీ మాత్రం డిసెంబర్ లక్ష్యంగా షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే కీలక భాగం పూర్తయ్యింది. ఎన్నికలు, ఫలితాలు, ప్రమాణ స్వీకారాలు తదితరాల వల్ల బాలయ్య గ్యాప్ తీసుకున్నాడు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. హిందుపూర్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ తరఫున తను ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా డేట్లు ఇచ్చేసి సహకరించాలనేది బాలయ్య ఆలోచన. ఒకవేళ డిసెంబర్ మిస్ అయ్యి సంక్రాంతికి బాలయ్య వస్తే రవితేజది డ్రాప్ చేయాల్సి ఉంటుంది.
This post was last modified on June 20, 2024 9:24 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…