Movie News

రెండు ఆప్షన్లు చూస్తున్న బాలయ్య 109

పెద్ద సినిమాల విడుదల తేదీ వ్యవహారం క్రమంగా సస్పెన్స్ మూవీని మించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కు వెళ్ళిపోయాక ఒక్కసారిగా ఇతర నిర్మాతల ప్లానింగ్ లో మార్పులు తలెత్తుతున్నాయి. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఎన్బికె 109 షూటింగ్ ఇంకా పూర్తవ్వనప్పటికీ 2024లోనే రిలీజ్ చేయాలనేది నిర్మాత సంకల్పం. ఎందుకంటే ఇదే బ్యానర్ లో రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తీస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ని 2025 సంక్రాంతికి లాక్ చేశారు కనక. ఇక్కడే కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి.

పుష్ప 2 డిసెంబర్ ఆరున వస్తుంది కాబట్టి రెండు వారాల గ్యాప్ తీసుకుని ఇరవైన బాలయ్య వస్తే ఇబ్బంది ఉండదు. కానీ తండేల్, రాబిన్ హుడ్ ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పుకోవడం ఫిక్సని ఫిలిం నగర్ టాక్. నితిన్ మూవీని నవంబర్ కు జరపాలని చూస్తున్నారు. ఎలాగూ తమ్ముడుని ఫిబ్రవరిలో తీసుకొచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఈ గ్యాప్ సరిపోతుంది. కానీ తండేల్ ని ఏం చేయాలనేది అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే వీలైనంత సోలోగా తండేల్ రావడం అవసరం. నేరుగా బాలయ్య లాంటి ఫుల్ ఫామ్ లో ఉన్న బడా స్టార్ హీరోతో తలపెడితే పెద్ద రిస్క్ అవుతుంది.

మరి చివరికి ఏం జరుగుతుందంటే ఎవరైనా ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దర్శకుడు బాబీ మాత్రం డిసెంబర్ లక్ష్యంగా షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే కీలక భాగం పూర్తయ్యింది. ఎన్నికలు, ఫలితాలు, ప్రమాణ స్వీకారాలు తదితరాల వల్ల బాలయ్య గ్యాప్ తీసుకున్నాడు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. హిందుపూర్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ తరఫున తను ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా డేట్లు ఇచ్చేసి సహకరించాలనేది బాలయ్య ఆలోచన. ఒకవేళ డిసెంబర్ మిస్ అయ్యి సంక్రాంతికి బాలయ్య వస్తే రవితేజది డ్రాప్ చేయాల్సి ఉంటుంది.

Satya

Recent Posts

శ్రీలీలని టార్గెట్ చేయడం సబబేనా

లెనిన్ విడుదలై మంచి స్పందన దక్కించుకున్నాక సోషల్ మీడియాలో శ్రీలీల డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే లెనిన్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు హీరోయిన్…

2 hours ago

కొత్త ‘ఈవిల్ డెడ్’ అంత భయపెట్టిందా

హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…

3 hours ago

తండ్రి కొడుకులకు కలిసొచ్చిన పల్లెటూరు

కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…

3 hours ago

ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన అక్కర్లేదు

నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…

4 hours ago

పల్లి పల్లి మంత్రి లోకేష్

పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…

4 hours ago

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…

4 hours ago