విజయ్ సేతుపతికి తమిళంలోనే కాక వేరే భాషల్లో కూడా నటుడిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో ‘సైరా’; ‘ఉప్పెన’ చిత్రాలు చేయడానికి ముందే అతను ఇక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.
కానీ తమిళంలో అతను హీరోగా నటించిన చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఏవీ పెద్దగా ఆడలేదు. సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేసేంత కెపాసిటీ సేతుపతికి లేదనే అంతా అనుకున్నారు. అందుకే తన కొత్త చిత్రం ‘మహారాజ’ను తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తుంటే ఇదొక వృథా ప్రయాస అనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఐతే ఈ సినిమా ప్రోమోలైతే ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కంటెంట్ మీద ధీమాతో రిలీజ్కు ముందు రోజే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ కూడా వేశారు. ఆశ్చర్యకరంగా ఆ షోలన్నీ జనాలతో నిండిపోయాయి. పైగా మంచి టాక్ వచ్చింది. ఇంకేముంది తొలి రోజు నుంచి మంచి వసూళ్లతో సాగిపోయింది ‘మహారాజ’.
గత వారాంతంలో సుధీర్ బాబు చిత్రం ‘హరోం హర’ మంచి అంచనాల మధ్య రిలీజైంది. దీంతో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిన్న సినిమా కూాడా రిలీజైంది. సుధీర్ చిత్రానికి ఓ మోస్తరు టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కానీ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ని జనాలు పట్టించుకోలేదు.
చివరికి చూస్తే తెలుగు చిత్రాలను వెనక్కి నెట్టి అనువాద చిత్రమైన ‘మహారాజ’ బాక్సాఫీస్ విన్నర్గా నిలిచింది. తక్కువ మొత్తానికి సినిమాను కొని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు ‘మహారాజ’ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమాకు వసూళ్లు నిలకడగా ఉన్నాయి.
తమిళంతో కలిపి ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. సోలో హీరోగా సేతుపతి రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. మొత్తానికి అతడికి తన 50వ చిత్రం కంటెంట్ పరంగా మెప్పించడమే కాక వసూళ్లలోనూ దూసుకెళ్లడంతో నిజంగానే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతోంది.
This post was last modified on June 19, 2024 2:27 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…