జయాపజయాలు పక్కనపెడితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు మాస్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. డబ్బింగ్ వెర్షన్ల రూపంలో హిందీ ఆడియన్స్ కి బాగా చేరువ కావడంతో అనువాద హక్కులకు మంచి ఆదాయం వస్తోంది.
దీన్ని తన వ్యక్తిగత క్రేజ్ గా భ్రమపడిన సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం మూడేళ్ళ విలువైన సమయాన్ని వృథా చేయడం కెరీర్ లోనే అతి పెద్ద పొరపాటు. ఇప్పుడిది తెలుసుకుని ప్రాజెక్టులు చేయడంలో వేగం పెంచాడు. నిర్మాణంలో ఉన్నవాటితో పాటు కొత్తగా ఒప్పుకునే సినిమాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది.
లుదీర్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ సాయి శ్రీనివాస్ ఒక కథకు ఓకే చెప్పాడని సమాచారం. వామన టైటిల్ తో రూపొందబోయే ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో ఊహించని అంశాలు చాలా ఉంటాయట. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఆల్రెడీ ఒక ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనికి కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. వామన రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలుపెట్టనుండగా కౌశిక్ సినిమా కూడా సమాంతరంగా జరిగే అవకాశముంది. ఈ రెండూ తనకు పెద్ద బ్రేకింగ్ పాయింట్స్ అవుతాయనే నమ్మకం సాయిశ్రీనివాస్ లో ఉందట.
ప్రస్తుతం తను టైసన్ నాయుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే వాయిదాల వల్ల విపరీతమైన జాప్యానికి గురైన ఈ మాస్ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది.
చిత్రీకరణలో అవాంతరాల వల్ల పోస్ట్ పోన్ల పర్వానికి బలైన టైసన్ నాయుడు కొత్త షెడ్యూల్ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. జూలై చివరిలో గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దసరా లేదా దీపావళి పోటీలో ఉన్న ఇతర సినిమాలను బట్టి టైసన్ నాయుడు విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు.
This post was last modified on June 19, 2024 12:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…