జయాపజయాలు పక్కనపెడితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు మాస్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. డబ్బింగ్ వెర్షన్ల రూపంలో హిందీ ఆడియన్స్ కి బాగా చేరువ కావడంతో అనువాద హక్కులకు మంచి ఆదాయం వస్తోంది.
దీన్ని తన వ్యక్తిగత క్రేజ్ గా భ్రమపడిన సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం మూడేళ్ళ విలువైన సమయాన్ని వృథా చేయడం కెరీర్ లోనే అతి పెద్ద పొరపాటు. ఇప్పుడిది తెలుసుకుని ప్రాజెక్టులు చేయడంలో వేగం పెంచాడు. నిర్మాణంలో ఉన్నవాటితో పాటు కొత్తగా ఒప్పుకునే సినిమాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది.
లుదీర్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ సాయి శ్రీనివాస్ ఒక కథకు ఓకే చెప్పాడని సమాచారం. వామన టైటిల్ తో రూపొందబోయే ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో ఊహించని అంశాలు చాలా ఉంటాయట. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో ఆల్రెడీ ఒక ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనికి కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. వామన రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలుపెట్టనుండగా కౌశిక్ సినిమా కూడా సమాంతరంగా జరిగే అవకాశముంది. ఈ రెండూ తనకు పెద్ద బ్రేకింగ్ పాయింట్స్ అవుతాయనే నమ్మకం సాయిశ్రీనివాస్ లో ఉందట.
ప్రస్తుతం తను టైసన్ నాయుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే వాయిదాల వల్ల విపరీతమైన జాప్యానికి గురైన ఈ మాస్ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది.
చిత్రీకరణలో అవాంతరాల వల్ల పోస్ట్ పోన్ల పర్వానికి బలైన టైసన్ నాయుడు కొత్త షెడ్యూల్ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది. జూలై చివరిలో గుమ్మడికాయ కొట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దసరా లేదా దీపావళి పోటీలో ఉన్న ఇతర సినిమాలను బట్టి టైసన్ నాయుడు విడుదల తేదీని నిర్ణయించబోతున్నారు.
This post was last modified on June 19, 2024 12:16 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…