కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే కుర్రాడి హత్య కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు చర్చనీయాంశమవుతున్న తరుణంలోనే దర్శన్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడం మరో సంచలనంగా మారింది.
శ్రీధర్ అనే దర్శన్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను దర్శన్ ఫాం హౌస్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడట. శ్రీధర్ సుసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. అంతే కాక వీడియో కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని.. తనను ఒంటరితనం వేధిస్తోందని.. అందుకే చనిపోతున్నానని శ్రీధర్ సుసైడ్ నోట్లో పేర్కొన్నట్లు వెల్లడైంది.
ఐతే దర్శన్ హత్య కేసులో చిక్కుకుని జైలు పాలైన సమయంలోనే తన మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రేణుకస్వామి హత్య విషయంలో శ్రీధర్ భాగస్వామ్యం ఏమైనా ఉందా.. లేక దర్శన్ ఈ కేసులో చిక్కుకోవడంతో ఆ బాధతో లేదా తనకు భవిష్యత్ లేదనే భయంతో శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే చర్చ నడుస్తోంది.
దర్శన్ తన భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ.. పవిత్ర గౌడ అనే నటితో చాలా ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉండడం నచ్చని రేణుక స్వామి అనే దర్శన్ అభిమాని.. పవిత్రను సోషల్ మీడియా వేదికగా దూషించడం, ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో అతణ్ని లక్ష్యంగా చేసుకున్న దర్శన్ తన సహాయకులతో కలిసి అతణ్ని చిత్ర హింసలు పెట్టి ఏకంగా హత్యే చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పవిత్ర గౌడ ఎ-1 కాగా.. దర్శన్ ఎ-2 కావడం గమనార్హం. ప్రస్తుతం వీళ్లిద్దరూ పోలీసుల రిమాండ్లో ఉన్నారు.
This post was last modified on June 19, 2024 9:59 am
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…