కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి అనే కుర్రాడి హత్య కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు చర్చనీయాంశమవుతున్న తరుణంలోనే దర్శన్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడం మరో సంచలనంగా మారింది.
శ్రీధర్ అనే దర్శన్ మేనేజర్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను దర్శన్ ఫాం హౌస్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడట. శ్రీధర్ సుసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. అంతే కాక వీడియో కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని.. తనను ఒంటరితనం వేధిస్తోందని.. అందుకే చనిపోతున్నానని శ్రీధర్ సుసైడ్ నోట్లో పేర్కొన్నట్లు వెల్లడైంది.
ఐతే దర్శన్ హత్య కేసులో చిక్కుకుని జైలు పాలైన సమయంలోనే తన మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రేణుకస్వామి హత్య విషయంలో శ్రీధర్ భాగస్వామ్యం ఏమైనా ఉందా.. లేక దర్శన్ ఈ కేసులో చిక్కుకోవడంతో ఆ బాధతో లేదా తనకు భవిష్యత్ లేదనే భయంతో శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే చర్చ నడుస్తోంది.
దర్శన్ తన భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ.. పవిత్ర గౌడ అనే నటితో చాలా ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉండడం నచ్చని రేణుక స్వామి అనే దర్శన్ అభిమాని.. పవిత్రను సోషల్ మీడియా వేదికగా దూషించడం, ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో అతణ్ని లక్ష్యంగా చేసుకున్న దర్శన్ తన సహాయకులతో కలిసి అతణ్ని చిత్ర హింసలు పెట్టి ఏకంగా హత్యే చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పవిత్ర గౌడ ఎ-1 కాగా.. దర్శన్ ఎ-2 కావడం గమనార్హం. ప్రస్తుతం వీళ్లిద్దరూ పోలీసుల రిమాండ్లో ఉన్నారు.
This post was last modified on June 19, 2024 9:59 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…