కమర్షియల్ గా రికార్డులు తిరగరాయకపోయినా సబ్జెక్టులో ఉన్న సెన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభను గొప్పగా బయటికి తీసింది. బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయం నమోదు చేసుకుంది. నాని సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కు తోడు స్నేహితుడు రిషిగా విజయ్ దేవరకొండ నటన తనకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇది చూసే సందీప్ రెడ్డి రంగా అర్జున్ రెడ్డి అవకాశం ఇచ్చి ఉంటారని అభిమానులు భావిస్తారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోని తెరమీద చూసే ఛాన్స్ దక్కలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఆ అవకాశం దక్కిందని టాక్.
కల్కి 2898 ఏడిలో నాని కృష్ణుడిగా, విజయ్ దేవరకొండ అర్జునుడిగా కాసేపు క్యామియోల్లో కనిపిస్తారనే లీక్ ఆసక్తికరంగా ఉంది. మహాభారత హీరోలకు కల్కితో ఏం పనంటే దీని వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంటుందట. ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా నాగఅశ్విన్ చేయించే ప్రయాణంలో భాగంగా ఈ ఇద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయని అంటున్నారు. ట్రైలర్ వచ్చాక కొందరు ప్రభాస్ భైరవ అయితే కల్కి విజయ్ దేవరకొండ అంటూ కొత్త విశ్లేషణలు చేశారు. కానీ అవి నిజం కావు. కల్కిగా వేరొకరు ఉండరు. ఇది మాత్రం పక్కా. అయితే ముగ్గురి కాంబోలో సన్నివేశాలు ఉంటాయా లేదానేది వేచి చూడాలి.
వైజయంతి, స్వప్న సంస్థల్లో సినిమాలు చేసినవాళ్ళందరూ చిన్నదో పెద్దదో ఏదో ఒక క్యారెక్టర్ ద్వారా కల్కిలో భాగమయ్యారని ముందు నుంచి వినిపిస్తున్న మాట. బయటికి చెప్పకుండా కేవలం స్క్రీన్ మీద మాత్రమే సర్ప్రైజ్ ఇవ్వాలని దాచినవి కూడా జూన్ 27నే తెలియబోతున్నాయి. అంచనాలపరంగా ఆకాశాన్ని దాటి ప్రయాణిస్తున్న కల్కి 2898 ఏడి రిలీజ్ కు ఇంకో పదమూడు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచాలని అభిమానులు కోరుతున్నారు. సరిపడా హైప్ ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తదితర కార్యక్రమాలతో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని వాళ్ళ కోరిక.
This post was last modified on June 14, 2024 10:08 am
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం…