టాలీవుడ్ నుంచి మరో ప్రపంచ స్థాయి సినిమా సిద్ధమైంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలదని అంచనాలున్న ఆ చిత్రమే.. కల్కి.
వైజయంతీ మూవీస్ బేనర్ మీద ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారు.
ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కల్కి’ ఉంటుందని అర్థమవుతోంది. ప్రేక్షకుల్లో సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలు రిలీజ్ దగ్గర పడేసరికి ఇంకా పెరుగుతున్నాయి. ఈ సినిమాకు యుఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్కడ ప్రి సేల్స్ గట్టిగానే జరుగుతున్నాయి.
యుఎస్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రి సేల్స్ సాధించిన ఇండియన్ మూవీగా ‘కల్కి’ రికార్డు సృష్టించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం బద్దలు కొట్టింది. ‘కల్కి’ ప్రి సేల్స్ మొదలై కొన్ని రోజులే అయింది. ఈ లోపే 1 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది.
రిలీజ్ లోపే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును కూడా అందుకోవడం లాంఛనమే. వీకెండ్లోనే 5 మిలియన్ క్లబ్బులో కూడా అడుగు పెట్టొచ్చు. టాక్ బాగుంటే ‘ఆర్ఆర్ఆర్’ను అధిగమించి ‘బాహుబలి-2’ రికార్డులకు కూడా చేరువగా వెళ్లొచ్చు.
ఈ నెల 27న ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు కూడా పాతర వేయడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
This post was last modified on June 13, 2024 5:37 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…