మూడేళ్ళ క్రితం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఒక్కసారిగా డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనకే ఆఫర్లు క్యూ కట్టాయి. లుక్స్, నటన రెండూ బాగుండటంతో తక్కువ టైంలో టాప్ ప్లేస్ కి దూసుకుపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సూపర్ హిట్లు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పలకరించాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది.
సరే జరిగిందేదో జరిగింది శర్వానంద్ మనమేతో మళ్ళీ ట్రాక్ లో పడొచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది. కానీ తీరా చూస్తే మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం. వీకెండ్ దాకా బాగానే లాకొచ్చినా సోమవారం నుంచి బాగా నెమ్మదించింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనీసం రెండు వారాలు స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. ఈ శుక్రవారం ఆరు రిలీజులు థియేటర్లను బాగానే లాగేసుకుంటాయి. మనమే రెండో వారం అగ్రిమెంట్లు బాగానే జరిగాయి కానీ స్క్రీన్ కౌంట్ మరీ ఎక్కువ తగ్గకపోవచ్చు.
ఎలా చూసుకున్న మనమే ద్వారా కృతి శెట్టి జరిగిన మేలు పెద్దగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం తను తమిళంలోనే మూడు సినిమాలు చేస్తోంది. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జయం రవి జీనీలు వాటిలో ఉన్నాయి. ఇవి కనక విజయవంతమైతే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తెలుగులో మాత్రం అవకాశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఇమేజ్ ఉన్న హీరోల సరసన నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న కృతి శెట్టి మొన్న ఏడాది బాలా దర్శకత్వంలో సూర్యతో ఓకే చేసుకున్న మూవీ క్యాన్సిల్ కావడం బ్యాడ్ లక్. మరి తమిళంలోనైనా జెండా పాతుతుందేమో చూడాలి.
This post was last modified on June 11, 2024 10:01 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…