మూడేళ్ళ క్రితం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఒక్కసారిగా డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనకే ఆఫర్లు క్యూ కట్టాయి. లుక్స్, నటన రెండూ బాగుండటంతో తక్కువ టైంలో టాప్ ప్లేస్ కి దూసుకుపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సూపర్ హిట్లు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పలకరించాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది.
సరే జరిగిందేదో జరిగింది శర్వానంద్ మనమేతో మళ్ళీ ట్రాక్ లో పడొచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది. కానీ తీరా చూస్తే మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం. వీకెండ్ దాకా బాగానే లాకొచ్చినా సోమవారం నుంచి బాగా నెమ్మదించింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనీసం రెండు వారాలు స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. ఈ శుక్రవారం ఆరు రిలీజులు థియేటర్లను బాగానే లాగేసుకుంటాయి. మనమే రెండో వారం అగ్రిమెంట్లు బాగానే జరిగాయి కానీ స్క్రీన్ కౌంట్ మరీ ఎక్కువ తగ్గకపోవచ్చు.
ఎలా చూసుకున్న మనమే ద్వారా కృతి శెట్టి జరిగిన మేలు పెద్దగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం తను తమిళంలోనే మూడు సినిమాలు చేస్తోంది. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జయం రవి జీనీలు వాటిలో ఉన్నాయి. ఇవి కనక విజయవంతమైతే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తెలుగులో మాత్రం అవకాశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఇమేజ్ ఉన్న హీరోల సరసన నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న కృతి శెట్టి మొన్న ఏడాది బాలా దర్శకత్వంలో సూర్యతో ఓకే చేసుకున్న మూవీ క్యాన్సిల్ కావడం బ్యాడ్ లక్. మరి తమిళంలోనైనా జెండా పాతుతుందేమో చూడాలి.
This post was last modified on June 11, 2024 10:01 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…