మూడేళ్ళ క్రితం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఒక్కసారిగా డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనకే ఆఫర్లు క్యూ కట్టాయి. లుక్స్, నటన రెండూ బాగుండటంతో తక్కువ టైంలో టాప్ ప్లేస్ కి దూసుకుపోవచ్చని ఫ్యాన్స్ భావించారు. దానికి తగ్గట్టే బంగార్రాజు, శ్యామ్ సింగ రాయ్ సూపర్ హిట్లు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు పలకరించాయి. దీంతో సహజంగానే మార్కెట్ మీద ప్రభావం పడింది.
సరే జరిగిందేదో జరిగింది శర్వానంద్ మనమేతో మళ్ళీ ట్రాక్ లో పడొచ్చనే కాన్ఫిడెన్స్ కృతి శెట్టిలో బలంగా ఉండేది. కానీ తీరా చూస్తే మరీ బ్యాడ్ అనిపించుకోలేదు కానీ మనమే అంచనాలు పూర్తిగా అందుకోలేదన్నది వాస్తవం. వీకెండ్ దాకా బాగానే లాకొచ్చినా సోమవారం నుంచి బాగా నెమ్మదించింది. యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కనీసం రెండు వారాలు స్ట్రాంగ్ గా ఉండేది కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. ఈ శుక్రవారం ఆరు రిలీజులు థియేటర్లను బాగానే లాగేసుకుంటాయి. మనమే రెండో వారం అగ్రిమెంట్లు బాగానే జరిగాయి కానీ స్క్రీన్ కౌంట్ మరీ ఎక్కువ తగ్గకపోవచ్చు.
ఎలా చూసుకున్న మనమే ద్వారా కృతి శెట్టి జరిగిన మేలు పెద్దగా లేదనే చెప్పాలి. ప్రస్తుతం తను తమిళంలోనే మూడు సినిమాలు చేస్తోంది. కార్తీ వా వాతియార్, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జయం రవి జీనీలు వాటిలో ఉన్నాయి. ఇవి కనక విజయవంతమైతే కోలీవుడ్ లో జెండా పాతొచ్చు. తెలుగులో మాత్రం అవకాశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఇమేజ్ ఉన్న హీరోల సరసన నటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్న కృతి శెట్టి మొన్న ఏడాది బాలా దర్శకత్వంలో సూర్యతో ఓకే చేసుకున్న మూవీ క్యాన్సిల్ కావడం బ్యాడ్ లక్. మరి తమిళంలోనైనా జెండా పాతుతుందేమో చూడాలి.
This post was last modified on June 11, 2024 10:01 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…