సరిగ్గా ఇంకో 20 రోజుల్లో కల్కి 2898 ఏడి థియేటర్లలో ఉంటుంది. ట్రైలర్ జూన్ 10న చూసేయొచ్చు. బాహుబలి రేంజ్ హైప్ కనిపించడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ నిజానికి అసలైన కంటెంట్ రాబోయే రెండు వారాల్లో రాబోతోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వం మారిపోయిన తరుణంలో నిర్మాత అశ్వినీదత్ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నారట. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఇద్దరూ పరిశ్రమకు కావాల్సిన వ్యక్తులే కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్మిషన్లు వచ్చేస్తాయి. ఇక జ్వరం సంగతి చూద్దాం.
విదేశాల్లో కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. కేవలం ఒక్క రోజు నిడివిlo సుమారు 5 వేల టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇంకా మూడు వారాల టైం ఉన్న నేపథ్యంలో సులభంగా సలార్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఓవర్సీస్ బయ్యర్లు ధీమాగా చెబుతున్నారు.
ఇప్పటిదాకా 116 లొకేషన్లకు సంబంధించి బుకింగ్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరగనుంది. హాలీవుడ్ మూవీ క్వయిట్ ప్లేస్ కొత్త భాగం రిలీజ్ కూడా సమాంతరంగా ఉండటంతో భారీ సంఖ్యలో స్క్రీన్లు దక్కేందుకు ఇది అడ్డంకిగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20 తర్వాత ఏ నిమిషమైనా ఆన్ లైన్ అమ్మకాలు షురూ అవుతాయి. ఫీవర్ చూస్తుంటే బుక్ మై షో, పేటిఎం లాంటి యాప్స్ నిమిషాల వ్యవధిలో క్రాష్ కావడం ఖాయంగా తోస్తోంది. అసలే ఫాంటసీ మూవీ. అందులోనూ ప్రభాస్ తో ఆరు వందల కోట్లతో నిర్మించిన గ్రాండియర్.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటించారు. హైప్ కి ఇంతకన్నా ఏం కావాలనేది ఫ్యాన్స్ మాట. ఇదంతా ఎలా ఉన్నా ప్రమోషన్ల వేగం పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా మూవీగా కల్కి బద్దలుకొట్టే రికార్డులు మాములుగా ఉండవు.
This post was last modified on June 7, 2024 8:28 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…