ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమానే అయినా మన్మథుడుకి ప్రేక్షకుల్లో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆ మధ్య రీ రిలీజ్ చేసినప్పుడు థియేటర్లు హౌస్ ఫుల్ చేసి ఎంజాయ్ చేశారు అభిమానులు. నాగార్జున యాక్టింగ్, త్రివిక్రమ్ రైటింగ్ ఎంతగా గుర్తుండిపోయిందో అంతే స్థాయిలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు పాత్ర కూడా మెమరీలో భద్రంగా ఉండిపోయింది. చనిపోయే పాత్రే అయినా క్యూట్ లుక్స్, చక్కని నటనతో ఆకట్టుకున్న తీరు ఎన్నిసార్లు చూసిన ఫ్రెష్ అనిపిస్తుంది. ప్రభాస్ తో రాఘవేంద్ర చేశాక అన్షు కనిపించకుండా వెళ్ళిపోయి విదేశాల్లో సెటిలైపోయింది.
కట్ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత అన్షుతో రీ ఎంట్రీ ఇప్పిస్తున్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ లో ఈవిడను రావు రమేష్ ప్రియురాలిగా పునఃపరిచయం చేయబోతున్నారని తెలిసింది. అయితే ఏదో రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టు తరహాలో కాకుండా అన్షు మీద ఓ రేంజ్ కామెడీ ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఈ జంట మధ్య సన్నివేశాలు పేలిపోయేలా ఉంటాయని సమాచారం. లేటు వయసు లవ్ ట్రాక్స్ జాగ్రత్తగా డీల్ చేయాలి. తేడా రాకూడదు. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట.
దీనికి మజాకా టైటిల్ ని దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ధమాకా తరహాలో క్యాచీ సౌండ్ తో మాస్ వర్గాలను ఆకట్టుకునేలా పేరు పెట్టబోతున్నారు. ఊరిపేరు భైరవకోనతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ సందీప్ కిషన్ దీంతో తిరిగి ఎంటర్ టైన్మెంట్ జానర్ లోకి వస్తానని నమ్మకంతో ఉన్నాడు. ఇదే కథను గతంలో చిరంజీవికి ప్లాన్ చేసుకుని ఆయన వద్దనుకోవడంతో ముఖ్యమైన మార్పులు చేసి రావు రమేష్ సందీప్ కిషన్ లకు తగ్గట్టుగా రాసుకున్నారు. అయినా లేటు వయసు అన్న మాటే కానీ మన్మథుడు రీ రిలీజ్ సందర్భంగా ఆమె ఇచ్చిన వీడియో బైట్ లో గ్లామర్ చూసి అందరూ షాక్ తిన్నారు.
This post was last modified on June 7, 2024 3:01 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…