మాములుగా సినిమాలు, ఆధ్యాత్మికత తప్ప రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోని హీరో వెంకటేష్. గతంలో తండ్రి రామానాయుడు గారు ఈ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా సురేష్ బాబుతో సహా అన్నదమ్ములిద్దరూ దీనికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే వెంకీ మామ ఈసారి మినహాయింపు ఇచ్చారు. తనకు కావాల్సిన వాళ్ళ కోసం స్వయంగా ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రత్యక్షంగా క్యాంపైన్స్ లో పాల్గొన్నారు. ఆయన లక్కీ హ్యాండ్ పని చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెంకటేష్ ఎవరికోసమైతే పని చేశారో ఆ ఇద్దరు అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం విశేషమేగా.
వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కోసం వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయమని పబ్లిక్ ని అభ్యర్థించారు. కూతురు ఆశ్రితను వాళ్ళబాయికి చేసుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురాంరెడ్డి రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. ఏపీలో కూటమి తరఫున నిలబడిన బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ కోసం వెంకటేష్ కైకలూరు వచ్చారు. జన స్పందన విశేషంగా వచ్చింది. కట్ చేస్తే 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు. కలియుగ పాండవులు తర్వాత వెంకటేష్ కు పెళ్లి సంబంధం కుదిర్చింది ఈ శ్రీనివాసే.
ఏదైతేనేం దగ్గుబాటి కుటుంబానికి అత్యంత సన్నిహితులు గెలుపు సాధించడం వెంకీ ఫ్యామిలీలో సంతోషాన్ని తీసుకొచ్చింది. తాజా రాజకీయ పరిణామాలు వెంకటేష్ కి ఆనందం కలిగించేవే. ఆప్త మిత్రుడు, గోపాల గోపాల కో స్టార్ పవన్ కళ్యాణ్ వంద శాతం గెలుపు సాధించగా చంద్రబాబునాయుడు సీఎం పీఠం దక్కించుకోవడం రెండూ జరిగాయి. రానా నాయుడు వెబ్ సిరీస్ రెండో సీజన్ షూటింగ్ కోసం ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్న వెంకటేష్ అది పూర్తి కాగానే దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ మూవీ సెట్లో అడుగు పెడతారు.
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…