ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో అంచనాల పరంగా శర్వానంద్ మనమే అగ్రస్థానంలో ఉన్నప్పటికి తమ కంటెంట్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమా పోటీలో ఉన్న ఇతర చిత్రాల్లో కనిపిస్తోంది. వాటిలో రెండు ఒకే విషయంలో కాకతాళీయంగా ఒకటేలా అనిపించడం విశేషం. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన సత్యభామకు ఏ రేంజ్ లో ప్రమోషన్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. ట్రైలర్ అంచనాలు తీసుకురాగా బాలయ్య ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక ఆడియన్స్ దృష్టిలో పడింది. శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చగా సుమన చిక్కాల దర్శకత్వం వహించారు.
మొదటిసారి కాజల్ అగర్వాల్ ఇందులో ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఇంకోవైపు పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషించిన రక్షణ కూడా అదే రోజు వస్తోంది. ఇది కూడా క్రైమ్ థ్రిల్లరే. నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ మోక్షం దక్కించుకోవడంలో ఆలస్యం జరిగింది. దీని మీదే నిర్మాత, పాయల్ పరస్పరం ఆరోపణలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఏ మేరకు సద్దుమణిగిందో కానీ మొత్తానికి జూన్ 7న థియేటర్లలో వదిలేందుకు సిద్ధమయ్యారు. కొంత గ్యాప్ తర్వాత మంగళవారం పాయల్ కు మంచి పేరు తీసుకొచ్చింది.
సో గ్లామర్ తో అలరించిన అందగత్తెలు ఇప్పుడు ఖాకీ దుస్తులు వేసుకుని ఎలా మెప్పిస్తారో చూడాలి. కాంపిటీషన్ అయితే బాగానే ఉంది కానీ మనమే, లవ్ మౌళిలతో తలపడటం అంత సులభంగా ఉండదు. కాకపోతే ఎన్నికల ఫలితాలు వెలువడి జనాలు మాములు మూడ్ లోకి వచ్చేసి ఉంటారు కాబట్టి శుక్రవారం థియేటర్లకు ఎవరు ఎక్కువ రప్పిస్తారనేది కీలకం కానుంది. జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కు మునుపటి రోజులు వచ్చేస్తాయని ట్రేడ్ ఎదురు చూస్తున్న టైంలో వస్తున్న మొదటి బంచ్ సినిమాలివి. ఎవరి అలరిస్తాయో ఏవి చేతులు ఎత్తేస్తాయో ఈ శుక్రవారం తేలిపోతుంది.
This post was last modified on June 3, 2024 5:07 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…