ఒక సినిమా కాస్త హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితం చూడకుండానే పార్ట్-2, లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తున్నాయి. కొన్ని అటకెక్కేస్తున్నాయి. ఐతే ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడం విశేషం. ఆ చిత్రమే.. ఇండియన్/భారతీయుడు.
ఒక హిట్ మూవీకి సీక్వెల్ మరీ ఇంత విరామం తర్వాత రావడం అరుదు. ఐతే ఇందులో తన ఆలస్యం ఏమీ లేదని.. శంకర్దే అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘భారతీయుడు’కు సీక్వెల్ చేద్దామని తానే ముందు ప్రతిపాదించానని.. అది కూడా ‘భారతీయుడు’ పెద్ద హిట్టయిన తర్వాతి రోజుల్లోనే శంకర్కు ఆ మాట చెప్పానని.. కానీ ఆయన దగ్గర అప్పటికి కథ లేక సాధ్యపడలేదని కమల్ వెల్లడించాడు.
ఇక ‘భారతీయుడు’ తెర వెనుక కథ గురించి కమల్ వెల్లడిస్తూ.. తాను 90వ దశకంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యానని.. ఆ సమయంలోనే శంకర్ తనకు ‘భారతీయుడు’ కథ చెప్పాడని.. ఐతే రెండు కథలూ ఒకేలా ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదని.. అప్పుడు శివాజీ గణేశనే చొరవ తీసుకుని.. “మనిద్దరం కలిసి వేరే సినిమాలు చేశాం కదా, ఈ కథ బాగుంది, నువ్వు భారతీయుడు సినిమానే చెయ్యి” అని తనకు చెప్పారని.. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే తాము ‘భారతీయుడు’ సినిమా తీశామని కమల్ చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ ఆడియో వేడుకలో తెలిపాడు.
ఇక శంకర్ మాట్లాడుతూ.. కమల్ లాంటి నటుడు ప్రపంచంలోనే లేడని.. ఆయన 360 డిగ్రీలకు మించి నటించగలడని.. ‘భారతీయుడు’ను మించి ‘భారతీయుడు-2’; ‘భారతీయుడు-3’ విజయవంతం అవుతాయని అన్నాడు.
This post was last modified on June 3, 2024 4:30 pm
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…