ఒక సినిమా కాస్త హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితం చూడకుండానే పార్ట్-2, లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తున్నాయి. కొన్ని అటకెక్కేస్తున్నాయి. ఐతే ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడం విశేషం. ఆ చిత్రమే.. ఇండియన్/భారతీయుడు.
ఒక హిట్ మూవీకి సీక్వెల్ మరీ ఇంత విరామం తర్వాత రావడం అరుదు. ఐతే ఇందులో తన ఆలస్యం ఏమీ లేదని.. శంకర్దే అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘భారతీయుడు’కు సీక్వెల్ చేద్దామని తానే ముందు ప్రతిపాదించానని.. అది కూడా ‘భారతీయుడు’ పెద్ద హిట్టయిన తర్వాతి రోజుల్లోనే శంకర్కు ఆ మాట చెప్పానని.. కానీ ఆయన దగ్గర అప్పటికి కథ లేక సాధ్యపడలేదని కమల్ వెల్లడించాడు.
ఇక ‘భారతీయుడు’ తెర వెనుక కథ గురించి కమల్ వెల్లడిస్తూ.. తాను 90వ దశకంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యానని.. ఆ సమయంలోనే శంకర్ తనకు ‘భారతీయుడు’ కథ చెప్పాడని.. ఐతే రెండు కథలూ ఒకేలా ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదని.. అప్పుడు శివాజీ గణేశనే చొరవ తీసుకుని.. “మనిద్దరం కలిసి వేరే సినిమాలు చేశాం కదా, ఈ కథ బాగుంది, నువ్వు భారతీయుడు సినిమానే చెయ్యి” అని తనకు చెప్పారని.. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే తాము ‘భారతీయుడు’ సినిమా తీశామని కమల్ చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ ఆడియో వేడుకలో తెలిపాడు.
ఇక శంకర్ మాట్లాడుతూ.. కమల్ లాంటి నటుడు ప్రపంచంలోనే లేడని.. ఆయన 360 డిగ్రీలకు మించి నటించగలడని.. ‘భారతీయుడు’ను మించి ‘భారతీయుడు-2’; ‘భారతీయుడు-3’ విజయవంతం అవుతాయని అన్నాడు.
This post was last modified on June 3, 2024 4:30 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…