ఒక సినిమా కాస్త హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితం చూడకుండానే పార్ట్-2, లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తున్నాయి. కొన్ని అటకెక్కేస్తున్నాయి. ఐతే ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడం విశేషం. ఆ చిత్రమే.. ఇండియన్/భారతీయుడు.
ఒక హిట్ మూవీకి సీక్వెల్ మరీ ఇంత విరామం తర్వాత రావడం అరుదు. ఐతే ఇందులో తన ఆలస్యం ఏమీ లేదని.. శంకర్దే అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘భారతీయుడు’కు సీక్వెల్ చేద్దామని తానే ముందు ప్రతిపాదించానని.. అది కూడా ‘భారతీయుడు’ పెద్ద హిట్టయిన తర్వాతి రోజుల్లోనే శంకర్కు ఆ మాట చెప్పానని.. కానీ ఆయన దగ్గర అప్పటికి కథ లేక సాధ్యపడలేదని కమల్ వెల్లడించాడు.
ఇక ‘భారతీయుడు’ తెర వెనుక కథ గురించి కమల్ వెల్లడిస్తూ.. తాను 90వ దశకంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యానని.. ఆ సమయంలోనే శంకర్ తనకు ‘భారతీయుడు’ కథ చెప్పాడని.. ఐతే రెండు కథలూ ఒకేలా ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదని.. అప్పుడు శివాజీ గణేశనే చొరవ తీసుకుని.. “మనిద్దరం కలిసి వేరే సినిమాలు చేశాం కదా, ఈ కథ బాగుంది, నువ్వు భారతీయుడు సినిమానే చెయ్యి” అని తనకు చెప్పారని.. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే తాము ‘భారతీయుడు’ సినిమా తీశామని కమల్ చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ ఆడియో వేడుకలో తెలిపాడు.
ఇక శంకర్ మాట్లాడుతూ.. కమల్ లాంటి నటుడు ప్రపంచంలోనే లేడని.. ఆయన 360 డిగ్రీలకు మించి నటించగలడని.. ‘భారతీయుడు’ను మించి ‘భారతీయుడు-2’; ‘భారతీయుడు-3’ విజయవంతం అవుతాయని అన్నాడు.
This post was last modified on June 3, 2024 4:30 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…