ఒక సినిమా కాస్త హిట్ అవ్వగానే దానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితం చూడకుండానే పార్ట్-2, లేదా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాలుస్తున్నాయి. కొన్ని అటకెక్కేస్తున్నాయి. ఐతే ఎప్పుడో 28 ఏళ్ల ముందు వచ్చిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడం విశేషం. ఆ చిత్రమే.. ఇండియన్/భారతీయుడు.
ఒక హిట్ మూవీకి సీక్వెల్ మరీ ఇంత విరామం తర్వాత రావడం అరుదు. ఐతే ఇందులో తన ఆలస్యం ఏమీ లేదని.. శంకర్దే అని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. ‘భారతీయుడు’కు సీక్వెల్ చేద్దామని తానే ముందు ప్రతిపాదించానని.. అది కూడా ‘భారతీయుడు’ పెద్ద హిట్టయిన తర్వాతి రోజుల్లోనే శంకర్కు ఆ మాట చెప్పానని.. కానీ ఆయన దగ్గర అప్పటికి కథ లేక సాధ్యపడలేదని కమల్ వెల్లడించాడు.
ఇక ‘భారతీయుడు’ తెర వెనుక కథ గురించి కమల్ వెల్లడిస్తూ.. తాను 90వ దశకంలో లెజెండరీ నటుడు శివాజీ గణేశన్తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యానని.. ఆ సమయంలోనే శంకర్ తనకు ‘భారతీయుడు’ కథ చెప్పాడని.. ఐతే రెండు కథలూ ఒకేలా ఉండడంతో ఏం చేయాలో పాలుపోలేదని.. అప్పుడు శివాజీ గణేశనే చొరవ తీసుకుని.. “మనిద్దరం కలిసి వేరే సినిమాలు చేశాం కదా, ఈ కథ బాగుంది, నువ్వు భారతీయుడు సినిమానే చెయ్యి” అని తనకు చెప్పారని.. ఆయన ఇచ్చిన నమ్మకంతోనే తాము ‘భారతీయుడు’ సినిమా తీశామని కమల్ చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ ఆడియో వేడుకలో తెలిపాడు.
ఇక శంకర్ మాట్లాడుతూ.. కమల్ లాంటి నటుడు ప్రపంచంలోనే లేడని.. ఆయన 360 డిగ్రీలకు మించి నటించగలడని.. ‘భారతీయుడు’ను మించి ‘భారతీయుడు-2’; ‘భారతీయుడు-3’ విజయవంతం అవుతాయని అన్నాడు.
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…