పిఠాపురం.. కొన్ని వారాలుగా ఈ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. జనసేన అధినేత ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంచుకున్న నియోజకవర్గం కావడమే అందుక్కారణం. ఆ మేరకు ప్రకటన వచ్చిన తొలి రోజు నుంచి పిఠాపురం పేరు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతూ వస్తోంది. అక్కడ పవన్ ప్రచారానికి వెళ్లిన ప్రతిసారీ జనం బ్రహ్మరథం పట్టారు. ఆ నియోజకవర్గం నుంచి పవన్ భారీ మెజారిటీతో గెలవబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. పవన్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎన్నికైతే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అంచనా వేస్తున్నారు. తొలిసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి పవన్ చేయాల్సిందల్లా చేస్తారనడంలో సందేహం లేదు.
ఐతే ఇంకా ఫలితాల ప్రకటన రాకముందే పిఠాపురానికి హైప్ క్రియేట్ అయి.. అక్కడ ఓ పేరున్న సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రమే.. మనమే. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాను నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ పవన్కు సన్నిహితుడు. ఇక ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ను పిఠాపురంలో నిర్వహించే ఆలోచన చేస్తున్నారని.. ఎన్నికల ఫలితాలు రాగానే తర్వాతి రోజే అక్కడ ఈవెంట్ చేస్తే మంచి హైప్ కూడా వస్తుందని.. ఇందుకోసం అనుమతులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్రేజీ రూమర్లలో వాస్తవమెంతో చూడాలి.
This post was last modified on June 2, 2024 2:58 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…