ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాలో మహా అయితే అయిదారు పాటలు ఉండటమే మహా కష్టంగా మారిపోతోంది. వాటిని షూట్ చేయడంలో ఉన్న రిస్క్ ఒక కారణమైతే అన్ని సాంగ్స్ బెస్ట్ ఇచ్చే సంగీత దర్శకులు కరువ్వడం మరో రీజన్. అందుకే ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా సరే నాలుగైదు పాటలలోపే పరిమితులు విధించుకుంటున్నాయి. ఒకప్పుడు ఇలా లేదు. ఉదాహరణకు రాఘవేంద్రరావు దృశ్యకావ్యాలు అన్నమయ్య – పెళ్లి సందడిలో డజను పైగా పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. బాలీవుడ్ క్లాసిక్ హం ఆప్కె హై కౌన్ లో ఏకంగా 14 పాటలు ఉంటాయి. అన్నీ ఛార్ట్ బస్టర్సే.
సరే వర్తమానానికి వస్తే జూన్ 7 విడుదల కాబోతున్న శర్వానంద్ మనమేలో ఏకంగా 16 పాటలు ఉంటాయని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. చైల్డ్ కామెడీ ప్లస్ సెంటిమెంట్ మీద నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఇంత పెద్ద ఆల్బమ్ అంటే ఖచ్చితంగా షాకే.
మ్యూజిక్ సెన్సేషన్ గా మారుతున్న హేశం అబ్దుల్ వహాబ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ వర్క్ అవుతుందని, రీ రికార్డింగ్ కూడా అంతే బెస్ట్ ఇచ్చాడని కితాబు ఇవ్వడం చూస్తే సంగీత ప్రియులకు పండగే అనుకోవచ్చు. అయితే అన్ని పాటలు ఒకే లెన్త్ లో ఉండకపోయినా ట్యూన్లు ఖచ్చితంగా వేరే ఉంటాయి.
ఇది సక్సెస్ అయితే కనక ఎక్కువ పాటలు ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని అర్థమైపోతుంది కాబట్టి మిగిలిన దర్శకులూ అనుసరించే ఛాన్స్ ఉంటుంది. ఖుషి నుంచి తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హేశంకి మనమే మంచి ప్రమోషన్ అయ్యేలా ఉంది.
ఒకే ఒక జీవితం తర్వాత రెండేళ్ల గ్యాప్ వచ్చేసిన శర్వానంద్ ఈసారి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గొడవలు పడి మరీ బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొచ్చామని, బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పేశాడు. హీరోయిన్ కృతి శెట్టికి సైతం మనమే సక్సెస్ కీలకం కానుంది. రిలీజ్ కు ఇంకో ఆరు రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ ని పెంచబోతున్నారు.
This post was last modified on June 1, 2024 3:11 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…