ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత శర్వానంద్ కు కొంత గ్యాప్ వచ్చింది. అనుకుని చేసింది కాకపోయినా అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 7 రిలీజ్ కాబోతున్న మనమే మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎన్నికల ఫలితాల తర్వాత రిలీజవుతున్న మొదటి స్టార్ హీరో మూవీ. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. రామ్ చరణ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఆన్ లైన్ వెర్షన్ వచ్చింది.
క్లుప్తంగా కథ చెప్పారు. ఒక అందమైన జంట (శర్వానంద్ – కృతి శెట్టి). ఇద్దరి ఆలోచనలు వేరైనా కలిసి ప్రయాణం చేసే రోజొస్తుంది. మధ్యలో ముద్దులొలికే ఒక బుల్లి బాబు(మాస్టర్ విక్రమ్ ఆదిత్య). విదేశాలకు వెళ్లే క్రమంలో ఈ ఇద్దరి మధ్య వీడు ఎలా వచ్చాడనేది సస్పెన్స్. ఇక్కడి నుంచి అసలు స్టోరీ షురూ. పిల్లల్ని పెంచడంలో అవగాహన లేని ఇతను నానా ఇబ్బందులు పడుతుంటాడు. అమ్మాయేమో ఈ వ్వవహారమంతా చూసి తిడుతూ ఉంటుంది. అసలు వీళ్ళ లవ్ స్టోరీ మధ్యలో ఆ బుడతడు ఎలా వచ్చాడు, ప్రేమలో ఎలాంటి చిక్కులు ఎదురుకున్నారనేదే తెరమీద చూడమంటున్నారు.
శర్వా కృతిలు క్యూట్ గా ఉండగా చైల్డ్ కామెడీతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొత్తగా ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సచిన్ కెడ్కర్, రాహుల్ రవీంద్రన్, సుదర్శన్ తదితరులతో పెద్ద క్యాస్టింగే పెట్టుకున్నారు. హేశం అబ్దుల్ వహాబ్ నేపధ్య సంగీతం మరోసారి ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకున్న మనం టైటిల్ కు తగ్గట్టే ఎంటర్ టైన్ చేయడమే కాన్సెప్ట్ గా తీసుకుంది. వచ్చే శుక్రవారం కాజల్ అగర్వాల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళితో పోటీ పడనున్న మనమే మంచి క్లాస్ కంటెంట్ తో వస్తున్న హామీ అయితే ఇచ్చింది
This post was last modified on June 1, 2024 12:36 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…