గత ఏడాది బేబీ బ్లాక్ బస్టర్ తో ఆనంద్ దేవరకొండ మంచి పెర్ఫార్మర్ అని రుజువు కావడమే కాదు మార్కెట్ కూడా పెరిగింది. నెలల గ్యాప్ తర్వాత కొత్త సినిమా గంగం గణేశాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పలు వాయిదాలు వేసుకుంటూ ఎట్టకేలకు మోక్షం దక్కించుకుంది.
గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగంతో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు విస్తృతమైన ప్రమోషన్లు చేశారు. కామెడీ హీస్ట్ థ్రిల్లర్ కావడంతో నిఖిల్ స్వామి రారా తరహాలో దీని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. గణేశా వాటిని ఏ మేరకు అందుకున్నాడో చూద్దాం.
అనాథైన గణేష్(ఆనంద్ దేవరకొండ) స్నేహితుడి (ఇమ్మానియేల్) తో దొంగతనాలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉంటాడు. ప్రియురాలు శృతి (నయన్ సారిక) డబ్బు మోజులో పడి హ్యాండివ్వడంతో ఎలాగైనా కోటీశ్వరుడు కావాలని ఫిక్సవుతాడు.
కోట్ల రూపాయల విలువ చేసే ఒక వజ్రాన్ని నగల దుకాణం నుంచి కొట్టేసి పారిపోతూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని ఒక గణేశుడి విగ్రహంలో దాచి పెడతాడు. అదేమో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి (రాజ్ అర్జున్)ది. శత్రువులు దాన్ని కొట్టేస్తారు. అక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. చివరి గణేష్ తన లక్ష్యం ఎలా అందుకున్నాడనేదే స్టోరీ.
ఇప్పుటి ఆడియన్స్ ని ఆషామాషీ జోకులతో నవ్వించలేం. అందులోనూ ఎంత సిల్లీగా ప్రయత్నిస్తే అంత తిరస్కారం ఎదురవుతుంది. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తీసుకున్న పాయింట్ కొత్తగా లేకపోయినా వినోదానికి బోలెడు స్కోప్ ఉన్నదే. కానీ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు.
హీరో విలన్ గ్యాంగ్ చుట్టూ నడిపించిన హాస్యం, రొమాంటిక్ ట్రాక్, ఇమ్మానియేల్ జోకులు, వెన్నెల కిశోర్ క్యామియో ఇవేవి పని చేయలేదు. ఓ వర్గం మాస్ ని అక్కడక్కడా నవ్వించినా ఓవరాల్ గా మెప్పించడంలో మాత్రం ఫెయిలయ్యాడు. బేబీ తర్వాత డిఫరెంట్ గా ట్రై చేద్దామని చూసిన ఆనంద్ కు వ్రతం, ఫలితం రెండూ దక్కలేదు.
This post was last modified on June 1, 2024 10:44 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…