ఈ రోజుల్లో పూర్తిగా కొత్త కథతో సినిమాలు తీసేవాళ్లు అరుదైనపోయారు. ఏ జానర్లో సినిమా చేసినా.. ఏదో ఒక పాత సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. అందులోనూ గ్యాంగ్స్టర్ డ్రామాలు అంటే చాలు.. జీరో నుంచి మొదలయ్యే హీరో.. అనుకోకుండా పెద్దవాడైపోవడం.. ఆపై ఒడుదొడుకులు.. చివరగా పాజిటివ్గా లేదా నెగెటివ్గా ఒక ముగింపు.. ఈ ఫార్మాట్లో సాగిపోతుంటాయి చిత్రాలు.
ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సైతం ఎన్నో పాత గ్యాంగ్స్టర్ డ్రామాలను గుర్తు చేసింది. ఈ చిత్రాన్ని నిజానికి శర్వానంద్తో చేద్దామని అనుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.
కానీ ఆల్రెడీ తాను ఇలాంటి సినిమా ఒకటి చేశానని శర్వా చెప్పినట్లు కృష్ణచైతన్య వెల్లడించాడు. ఆ సినిమా ఏదో కాదు.. సుధీర్ వర్మతో చేసిన ‘రణరంగం’. ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూస్తే ‘రణరంగం’తోనూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఓవరాల్గా కథ సంగతి ఇలా ఉంటే.. ఇందులో హీరో అనామకుడిగా మొదలై ఎమ్మెల్యే పంచన చేరడం.. తర్వాత ఆ ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చి తాను అభ్యర్థిగా నిలబడి గెలవడం.. ఆపై ఆ ఎమ్మెల్యేనే సవాల్ చేయడం.. ఈ లైన్ అంతా కూడా లెజెండరీ నటుడు మోహన్ బాబు సినిమా ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు గమనిస్తే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఐతే ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం ఈ చిత్రంలో లేకపోయింది. మోహన్ బాబు క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ను పండించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన వల్లే ఆ సినిమా చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఆ ఇంటెన్సిటీ మిస్ అయి చాలా సీన్లు కామెడీగా తయారయ్యాయి. ఓవరాల్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on May 31, 2024 10:35 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…