ఈ రోజుల్లో పూర్తిగా కొత్త కథతో సినిమాలు తీసేవాళ్లు అరుదైనపోయారు. ఏ జానర్లో సినిమా చేసినా.. ఏదో ఒక పాత సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. అందులోనూ గ్యాంగ్స్టర్ డ్రామాలు అంటే చాలు.. జీరో నుంచి మొదలయ్యే హీరో.. అనుకోకుండా పెద్దవాడైపోవడం.. ఆపై ఒడుదొడుకులు.. చివరగా పాజిటివ్గా లేదా నెగెటివ్గా ఒక ముగింపు.. ఈ ఫార్మాట్లో సాగిపోతుంటాయి చిత్రాలు.
ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సైతం ఎన్నో పాత గ్యాంగ్స్టర్ డ్రామాలను గుర్తు చేసింది. ఈ చిత్రాన్ని నిజానికి శర్వానంద్తో చేద్దామని అనుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.
కానీ ఆల్రెడీ తాను ఇలాంటి సినిమా ఒకటి చేశానని శర్వా చెప్పినట్లు కృష్ణచైతన్య వెల్లడించాడు. ఆ సినిమా ఏదో కాదు.. సుధీర్ వర్మతో చేసిన ‘రణరంగం’. ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూస్తే ‘రణరంగం’తోనూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఓవరాల్గా కథ సంగతి ఇలా ఉంటే.. ఇందులో హీరో అనామకుడిగా మొదలై ఎమ్మెల్యే పంచన చేరడం.. తర్వాత ఆ ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చి తాను అభ్యర్థిగా నిలబడి గెలవడం.. ఆపై ఆ ఎమ్మెల్యేనే సవాల్ చేయడం.. ఈ లైన్ అంతా కూడా లెజెండరీ నటుడు మోహన్ బాబు సినిమా ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు గమనిస్తే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఐతే ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం ఈ చిత్రంలో లేకపోయింది. మోహన్ బాబు క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ను పండించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన వల్లే ఆ సినిమా చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఆ ఇంటెన్సిటీ మిస్ అయి చాలా సీన్లు కామెడీగా తయారయ్యాయి. ఓవరాల్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on May 31, 2024 10:35 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…