ఈ రోజుల్లో పూర్తిగా కొత్త కథతో సినిమాలు తీసేవాళ్లు అరుదైనపోయారు. ఏ జానర్లో సినిమా చేసినా.. ఏదో ఒక పాత సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. అందులోనూ గ్యాంగ్స్టర్ డ్రామాలు అంటే చాలు.. జీరో నుంచి మొదలయ్యే హీరో.. అనుకోకుండా పెద్దవాడైపోవడం.. ఆపై ఒడుదొడుకులు.. చివరగా పాజిటివ్గా లేదా నెగెటివ్గా ఒక ముగింపు.. ఈ ఫార్మాట్లో సాగిపోతుంటాయి చిత్రాలు.
ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సైతం ఎన్నో పాత గ్యాంగ్స్టర్ డ్రామాలను గుర్తు చేసింది. ఈ చిత్రాన్ని నిజానికి శర్వానంద్తో చేద్దామని అనుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య.
కానీ ఆల్రెడీ తాను ఇలాంటి సినిమా ఒకటి చేశానని శర్వా చెప్పినట్లు కృష్ణచైతన్య వెల్లడించాడు. ఆ సినిమా ఏదో కాదు.. సుధీర్ వర్మతో చేసిన ‘రణరంగం’. ఈ రోజు రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూస్తే ‘రణరంగం’తోనూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఓవరాల్గా కథ సంగతి ఇలా ఉంటే.. ఇందులో హీరో అనామకుడిగా మొదలై ఎమ్మెల్యే పంచన చేరడం.. తర్వాత ఆ ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చి తాను అభ్యర్థిగా నిలబడి గెలవడం.. ఆపై ఆ ఎమ్మెల్యేనే సవాల్ చేయడం.. ఈ లైన్ అంతా కూడా లెజెండరీ నటుడు మోహన్ బాబు సినిమా ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
రెండు సినిమాల్లో సన్నివేశాలు గమనిస్తే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఐతే ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’లో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం ఈ చిత్రంలో లేకపోయింది. మోహన్ బాబు క్యారెక్టర్లో నెగెటివ్ షేడ్స్ను పండించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన వల్లే ఆ సినిమా చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ఆ ఇంటెన్సిటీ మిస్ అయి చాలా సీన్లు కామెడీగా తయారయ్యాయి. ఓవరాల్గా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…