సినీ తారలు తాము తెరపై పోషించే కొన్ని పాత్రల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ముఖ్యంగా సినిమాల్లో క్రీడాకారులుగా కనిపించినపుడు.. సంబంధిత ఆటలో శిక్షణ తప్పనిసరి. లేదంటే ఆ పాత్ర అభాసుపాలవుతుంది.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ తన కొత్త చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో క్రికెటర్ పాత్ర చేసింది. నిజంగా క్రికెటర్ తరహాలో కనిపించేందుకు ఆమె ట్రైనింగ్ తీసుకుంది. సంబంధిత వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే ఆ వీడియోలో ఆమె క్రికెట్ ఓనమాలు దిద్దుకున్న దశ నుంచి.. ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో షాట్లు ఆడే క్రమాన్ని చూపించారు. ఐతే ఈ వీడియో మరీ అతిగా ఉందని.. నాటకీయత ఎక్కువైందని జాన్విని నెటిజన్లు కొందరు ట్రోల్ చేశారు. ఇందుకు జాన్వి హర్టయింది.
వీడియోలో జాన్వి టెన్నిస్ బంతితో సాధన సాగించినట్లు చూపించారు. కానీ ఒంటికి గట్టిగా దెబ్బలు తగిలినట్లు చూపించడంతో ట్రోలింగ్ తప్పలేదు. ఐతే ట్రోలింగ్ కొంచెం శ్రుతి మించడంతో జాన్వి హర్టయింది. ట్రోలర్స్కు బదులిస్తూ కామెంట్ పెట్టింది. “ముందు క్రికెట్ బాల్తోనే సాధన చేశాను. అప్పుడే దెబ్బలు తగిలాయి. నా భుజాలకు ఉన్న బ్యాండేజీలను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. దెబ్బలు తగిలిన తర్వాత ఆడిన వీడియోనే ఇది. ట్రోల్ చేసే ముందు పూర్తి వీడియో చూడండి. అప్పుడు నేను కూడా మీరు వేసే జోక్లకు నవ్వుతాను” అని జాన్వి పేర్కొంది.
జాన్వి సరసన రాజ్ కుమార్ రావు నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రివ్యూలు, మౌత్ టాక్ బాగానే ఉన్నాయి.
This post was last modified on May 31, 2024 3:27 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…