కమెడియన్లుగా మంచి పేరు సంపాదించిన చాలా మంది తర్వాత హీరోలయ్యారు. ఈ జాబితాలోకి ఇటీవలే వెన్నెల కిషోర్ కూడా చేరాడు. ‘చారి 111’ అనే సినిమాతో అతను హీరో అయ్యాడు. ఇదొక కామెడీ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ. ‘చంటబ్బాయి’ స్టైల్లో ఏదో ట్రై చేశారు కానీ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. థియేటర్లలో ఈ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియకుండా పోయింది.
ఐతే ఈ చిత్రం ‘అమేజాన్ ప్రైమ్’ ద్వారా డిజిటల్ రిలీజ్ అయ్యాక మంచి స్పందన తెచ్చుకుంది. ప్రైమ్లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇది చూసే కిషోర్లో ఉత్సాహం వచ్చినట్లుంది. మళ్లీ అతను హీరోగా నటిస్తున్నాడు. అంతే కాక తొలి చిత్రం ‘చారి 111’ తరహాలోనే మళ్లీ కామెడీ డిటెక్టివ్ కథతోనే కిషోర్ హీరోగా రెండో సినిమా చేస్తుండడం విశేషం.
వెన్నెల కిషోర్ డిటెకివ్ పాత్ర చేస్తున్న కొత్త సినిమా పేరు.. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ రోజే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిన్న పిట్టకథ రూపంలో ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ ఇంట్రో కూడా ఇచ్చారు. “కథలు వెతలాయె కథనాలు ఏడాయె.. మొన్న సచ్చిన కుందేలు నిన్న కూరాయె… దాని చంపినోడు సచ్చి ఆరు నెల్లాయె.. ఈ చిక్కుముడి విప్పినోడు..” అని బ్రేక్ ఇస్తే ఒక పిల్లాడు ఆ విప్పినోడు అని అడుగుతాడు.
దానికి బదులుగా నరేటర్.. ‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్సాయె’’ అంటాడు. ఇలా ఫన్నీ నరేషన్తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ను పరిచయం చేశారు. వెన్నెల కిషోర్ గెటప్ ఫన్నీగా అనిపిస్తోంది. ఇందులో కిషోెర్ సరసన అనన్య నాగళ్ల కథానాయికగా చేస్తోంది. రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెన్నపూస రమణారెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
This post was last modified on May 30, 2024 6:49 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…