Movie News

నా సామిరంగ దర్శకుడికి ప్రశాంత్ వర్మ ప్రమోషన్

హనుమాన్ తర్వాత చాలా సినిమాల సమీకరణాలు, కాంబోలు మారిపోతున్నాయి. ఇది రిలీజ్ కావడానికి ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాత డివివి దానయ్య గారబ్బాయి కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ అధీరా అనే ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికో చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ ఆగిపోయాయి. హనుమాన్ ఆలస్యం కావడంతో పాటు దాని ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో కొంత కాలం కళ్యాణ్ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు దీన్ని ఇంకోవిధంగా సెట్ చేయబోతున్నారని తెలిసింది.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం అధీరా బాధ్యతను నా సామిరంగాతో ప్రూవ్ చేసుకున్న డాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ విజయ్ బిన్నీకి అప్పగించబోతున్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా జరుపుకున్న చర్చల మేరకు ఆల్మోస్ట్ డీల్ ఓకే అయ్యిందని సమాచారం. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ స్క్రిప్ట్ పనులతో పాటు రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బ్రహ్మరాక్షస (ప్రచారంలో ఉన్న టైటిల్) తాలూకు ప్రీ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నాడు. వేరే వాటి మీద దృష్టి పెట్టేంత టైం లేదు. ఈ కారణంగానే అధీరాకు సమయం సరిపోదు.

అందుకే కథ, రచన మొత్తం ప్రశాంత్ వర్మ చేసి డైరెక్షన్ మాత్రం విజయ్ బిన్నీకి ఇవ్వబోతున్నట్టు వినికిడి. అధికారిక ప్రకటన వచ్చే దాకా నిర్ధారణగా చెప్పలేం కానీ నిజమైతే మాత్రం మంచి నిర్ణయం అవుతుంది. నాగార్జునతోనే విజయ్ బిన్నీ ఇంకో సినిమా చేస్తాడనే వార్తలో నిజం లేదని స్పష్టత వచ్చేసింది. అధీరా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఉంటుంది. ఒక పది సినిమాలు చేశాక అందరినీ అవెంజర్స్ లాగా కలుపుతానని గతంలో చెప్పిన తీరులోనే కథా కథనాలు ఉంటాయట. అధీరాతో పాటు మరికొందరు సూపర్ హీరోల కథలను సిద్ధం చేసే ఆలోచన కూడా ప్రశాంత్ వర్మకు ఉందట .

This post was last modified on May 29, 2024 5:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

1 hour ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago