అన్ని భాషల్లో కలుపుకుని టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే కొన్ని క్షణాలు ఆలోచించాలేమో కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ముక్త కంఠంతో దీపికా పదుకునే పేరు చెబుతున్నారు. ఎందుకంటే కేవలం నాలుగు సినిమాలతో నాలుగు వేల కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశం అందరికీ దక్కదుగా. దీపికా గత మూడు చిత్రాలు పఠాన్, జవాన్, ఫైటర్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2550 కోట్లకి పైగా గ్రాస్ సాధించాయి. వచ్చే నెల 27 విడుదల కాబోయే కల్కి 2898 ఏడి టాక్ తో సంబంధం లేకుండా ఎంత లేదన్నా కనిష్టంగా పదిహేను వందల కోట్లు వసూలు చేయడం ఖాయం కాబట్టి టోటల్ ఫిగర్ షాకింగే.
ఇంత అరుదైన ఘనత బాలీవుడ్ లోనే కాదు ఇటు సౌత్ లోనూ ఎవరికీ దక్కలేదు. నిజానికి పఠాన్ కు ముందు దీపికా పదుకునే ఫ్లాపుల్లో ఉంది. గెహరాయి, చెపాక్, జీరో ఇలా వరసగా ఏడాదికో డిజాస్టర్ నమోదయ్యింది. భర్త రణ్వీర్ సింగ్ సర్కస్ లో క్యామియో చేస్తే అది కూడా దారుణంగా బోల్తా కొట్టింది. 83 ఒకటే రిలీఫ్ ఇచ్చింది కానీ అది వరల్డ్ కప్ బయోపిక్ కావడంతో ఆశించినంత ఎక్కువ పేరు రాలేదు. ఇంకోవైపు నిర్మాతగానూ మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇదేంటి ఐరన్ లెగ్ గా మారుతుందనుకుంటున్న టైంలో పఠాన్ నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇప్పుడు కల్కితో ఇవ్వబోతున్న టాలీవుడ్ ఎంట్రీ మరో మేజర్ బ్రేక్ కానుంది. అజయ్ దేవగన్ తో చేస్తున్న సింగం అగైన్ సైతం వేయి కోట్ల సత్తా ఉన్న ఫ్రాంచైజ్. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా డెలివరీకి ముందు అన్ని కమిట్ మెంట్లు పూర్తి చేసి కొంత బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉంది. ఎప్పుడనేది రణ్వీర్ దంపతులు వెల్లడించడం లేదు కానీ ఈ ఏడాది దసరాలోపే ఉండచ్చు. ఈ కారణంగానే కల్కి ప్రమోషన్లకు దాదాపు రాకపోవచ్చని అంటున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ ఫ్లైట్ లాంటిది ఏర్పాటు చేసే తీసుకొచ్చే ఆలోచనలో వైజయంతి బృందం ఉన్నట్టు తెలిసింది. చూడాలి.
This post was last modified on May 28, 2024 7:14 pm
అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…