అన్ని భాషల్లో కలుపుకుని టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే కొన్ని క్షణాలు ఆలోచించాలేమో కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం ముక్త కంఠంతో దీపికా పదుకునే పేరు చెబుతున్నారు. ఎందుకంటే కేవలం నాలుగు సినిమాలతో నాలుగు వేల కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశం అందరికీ దక్కదుగా. దీపికా గత మూడు చిత్రాలు పఠాన్, జవాన్, ఫైటర్ మొత్తం కలిపి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 2550 కోట్లకి పైగా గ్రాస్ సాధించాయి. వచ్చే నెల 27 విడుదల కాబోయే కల్కి 2898 ఏడి టాక్ తో సంబంధం లేకుండా ఎంత లేదన్నా కనిష్టంగా పదిహేను వందల కోట్లు వసూలు చేయడం ఖాయం కాబట్టి టోటల్ ఫిగర్ షాకింగే.
ఇంత అరుదైన ఘనత బాలీవుడ్ లోనే కాదు ఇటు సౌత్ లోనూ ఎవరికీ దక్కలేదు. నిజానికి పఠాన్ కు ముందు దీపికా పదుకునే ఫ్లాపుల్లో ఉంది. గెహరాయి, చెపాక్, జీరో ఇలా వరసగా ఏడాదికో డిజాస్టర్ నమోదయ్యింది. భర్త రణ్వీర్ సింగ్ సర్కస్ లో క్యామియో చేస్తే అది కూడా దారుణంగా బోల్తా కొట్టింది. 83 ఒకటే రిలీఫ్ ఇచ్చింది కానీ అది వరల్డ్ కప్ బయోపిక్ కావడంతో ఆశించినంత ఎక్కువ పేరు రాలేదు. ఇంకోవైపు నిర్మాతగానూ మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇదేంటి ఐరన్ లెగ్ గా మారుతుందనుకుంటున్న టైంలో పఠాన్ నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఇప్పుడు కల్కితో ఇవ్వబోతున్న టాలీవుడ్ ఎంట్రీ మరో మేజర్ బ్రేక్ కానుంది. అజయ్ దేవగన్ తో చేస్తున్న సింగం అగైన్ సైతం వేయి కోట్ల సత్తా ఉన్న ఫ్రాంచైజ్. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా డెలివరీకి ముందు అన్ని కమిట్ మెంట్లు పూర్తి చేసి కొంత బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉంది. ఎప్పుడనేది రణ్వీర్ దంపతులు వెల్లడించడం లేదు కానీ ఈ ఏడాది దసరాలోపే ఉండచ్చు. ఈ కారణంగానే కల్కి ప్రమోషన్లకు దాదాపు రాకపోవచ్చని అంటున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ ఫ్లైట్ లాంటిది ఏర్పాటు చేసే తీసుకొచ్చే ఆలోచనలో వైజయంతి బృందం ఉన్నట్టు తెలిసింది. చూడాలి.
This post was last modified on May 28, 2024 7:14 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…