నిన్న సాయంత్రం నిర్వహించిన గంగం గణేశా ఈవెంట్ లో ఆ సినిమా కంటెంట్ కన్నా మరో విషయం విపరీతంగా హైలైట్ అయ్యింది. ప్రత్యేక అతిథిగా రష్మిక మందన్న విచ్చేయగా తనతో ఆనంద్ దేవరకొండ చేసిన సరదా ఇంటర్వ్యూ కొన్ని సంగతులకు అధికారిక ముద్ర వేసినట్టు అయ్యింది. ముఖ్యంగా నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరని ఎదురైన ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ నా ఫ్యామిలీ అయ్యుండి ఇలా ట్రిక్ చేస్తావా అంటూ అనడమే కాక, రౌడీ బాయ్ అంటూ చివరిగా సమాధానం చెప్పడంతో విజయ్ దేవరకొండతో బంధం గురించి కాసిన్ని డౌట్లు కూడా పూర్తిగా తీరిపోయాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఆనంద్ కు సంబంధించిన ఈవెంట్లకు వస్తూనే ఉంటుంది. బేబీ పాట లాంచ్ కు విచ్చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గంగం గణేశాకు సైతం టైం ఒత్తిడి ఉన్నా సరే మిస్ చేయలేదు. ఆలస్యంగా అయినా హాజరయ్యింది. ఆనంద్ గురించి రష్మిక చెప్పిన మాటలు, క్వశ్చన్ అడిగినప్పుడు మ్యూట్ లో మాత్రమే వినాల్సిన ఒక మాట ను చనువుగా అనడం ఇవన్నీ సాధారణ బాండింగ్ లో వచ్చేవి కావు. మన ఫ్యామిలీ అని రష్మికనొక్కి చెప్పడం బట్టి విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి వస్తున్న కథలకు బలం చేకూరినట్టయ్యింది.
మొత్తానికి గంగం గణేశాకు మైలేజ్ వచ్చేసింది. ఈవెంట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలోని పాటకు లయబద్ధంగా రష్మిక, ఆనంద్ తో పాటు ఇతర టీమ్ సభ్యులు కాలు కదపడం ఆకట్టుకుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగంతో పోటీ పాడుతున్న గంగం గణేశా ప్రమోషన్ల కోసం ఆనంద్ టీమ్ ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీ చేస్తూనే ఉంది. కామెడీ క్రైమ్ జానర్ లో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ ఆకట్టుకుని ఓపెనింగ్స్ తెచ్చుకునేందుకు మంచి స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు.
This post was last modified on May 28, 2024 10:17 am
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…