నిన్న సాయంత్రం నిర్వహించిన గంగం గణేశా ఈవెంట్ లో ఆ సినిమా కంటెంట్ కన్నా మరో విషయం విపరీతంగా హైలైట్ అయ్యింది. ప్రత్యేక అతిథిగా రష్మిక మందన్న విచ్చేయగా తనతో ఆనంద్ దేవరకొండ చేసిన సరదా ఇంటర్వ్యూ కొన్ని సంగతులకు అధికారిక ముద్ర వేసినట్టు అయ్యింది. ముఖ్యంగా నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరని ఎదురైన ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ నా ఫ్యామిలీ అయ్యుండి ఇలా ట్రిక్ చేస్తావా అంటూ అనడమే కాక, రౌడీ బాయ్ అంటూ చివరిగా సమాధానం చెప్పడంతో విజయ్ దేవరకొండతో బంధం గురించి కాసిన్ని డౌట్లు కూడా పూర్తిగా తీరిపోయాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఆనంద్ కు సంబంధించిన ఈవెంట్లకు వస్తూనే ఉంటుంది. బేబీ పాట లాంచ్ కు విచ్చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గంగం గణేశాకు సైతం టైం ఒత్తిడి ఉన్నా సరే మిస్ చేయలేదు. ఆలస్యంగా అయినా హాజరయ్యింది. ఆనంద్ గురించి రష్మిక చెప్పిన మాటలు, క్వశ్చన్ అడిగినప్పుడు మ్యూట్ లో మాత్రమే వినాల్సిన ఒక మాట ను చనువుగా అనడం ఇవన్నీ సాధారణ బాండింగ్ లో వచ్చేవి కావు. మన ఫ్యామిలీ అని రష్మికనొక్కి చెప్పడం బట్టి విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి వస్తున్న కథలకు బలం చేకూరినట్టయ్యింది.
మొత్తానికి గంగం గణేశాకు మైలేజ్ వచ్చేసింది. ఈవెంట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలోని పాటకు లయబద్ధంగా రష్మిక, ఆనంద్ తో పాటు ఇతర టీమ్ సభ్యులు కాలు కదపడం ఆకట్టుకుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగంతో పోటీ పాడుతున్న గంగం గణేశా ప్రమోషన్ల కోసం ఆనంద్ టీమ్ ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీ చేస్తూనే ఉంది. కామెడీ క్రైమ్ జానర్ లో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ ఆకట్టుకుని ఓపెనింగ్స్ తెచ్చుకునేందుకు మంచి స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు.
This post was last modified on May 28, 2024 10:17 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…